జాతీయ వార్తలు

నేడు మోదీతో బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, సమస్యలపై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, అభివృద్ధి పథకాలకు అధిక శాతం నిధులు కేటాయించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపైనా ప్రధానితో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం రైల్వే మంత్రి సురేష్ ప్రభు సహా కేంద్ర పర్యాటక, ఆర్ అండ్ డి, రవాణా మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించనున్నారు.