నెల్లూరు

పెదపరియ వద్ద విరిగిన రైలు పట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఓజిలి, మార్చి 19: మండల పరిధిలోని పెదపరియ రైల్వేగేటు సమీపంలో ఉన్న 122 కిలోమీటరు వద్ద శనివారం చెన్నై మార్గంలోని రైలు పట్టా విరిగింది. దీంతో చెన్నైకి వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విధుల్లో ఉన్న గ్యాంగ్‌మెన్ రైలు పట్టా విరగడం గమనించి అప్రమత్తమై రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు విరిగిన రైలు పట్టాను తొలగించి దాని స్థానంలో మరో రైలు పట్టాను అమర్చారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగాయి.