జాతీయ వార్తలు

విధ్వంస లక్ష్యంతో.. ఆరుగురు ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:పఠాన్‌కోట్ మీదుగా ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించారన్న కథనాల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్, అసోం రాష్ట్రాలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఈ మూడు రాష్ట్రాల్లో హింస, విధ్వంస కాండలను సృష్టించే లక్ష్యంతో ఈ ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా నిఘా వర్గాలు వెల్లడించాయి. బ్రసెల్స్‌లో జరిగిన భయానక ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాలను ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ఇంతకు ముందు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపురావడం కలకలం రేపింది. దాంతో మొత్తం పది విమానాల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిపారు.

జావడేకర్ సమక్షంలోనే..
మోదీపై హురియత్ విసుర్లు
కాశ్మీర్ విధానాన్ని తప్పుబట్టిన నేతలు
న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ సమక్షంలోనే కాశ్మీర్ అతివాద, మితవాద హురియత్ నేతలు భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి జవడేకర్ హాజరయ్యారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి రాజకీయ మార్గంలోనే ముందుకు వెళ్లాలని కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా కఠిన వైఖరినే ప్రదర్శిస్తోందని హురియత్ నేతలు విమర్శలు గుప్పించారు.కేవలం 20నిముషాలు మాత్రమే ఉన్న జవడేకర్ పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హురియత్ మితవాద నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ ‘ బిజెపి సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో వాజపేయి విధానాన్ని అనుసరిస్తుందని భావించాం. కానీ మోదీ ప్రభుత్వం తన కఠిన వైఖరినే ప్రదర్శించింది’అని అన్నారు. హురియత్, కాశ్మీరీలు, పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఎలాంటి చర్చలు సఫలం కావన్నారు. కానీ వాజపేయి విధానాన్ని మోదీ సర్కార్ అమలు చేస్తుందని భావించడానికి ఇప్పటి వరకూ ఎలాంటి సంకేతాలు లేవన్నారు. కాశ్మీర్ విషయంలో యూపీఏ అనుసరించిన విధానానికి ఎన్‌డిఏ ప్రదర్శిస్తున్న వైఖరికీ ఎలాంటి తేడా లేదని అతివాద వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ అన్నారు.