జాతీయ వార్తలు
జగన్కు గుణపాఠం తప్పదు: పల్లె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 December 2015
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలుకాకుండా అవరోధాలు కల్పిస్తున్న వైకాపా అధినేత జగన్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలబెట్టటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. బాబును విశ్వసించిన ప్రజలు అధికారం తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారన్న నిజాన్ని జగన్ గ్రహించాలని ఆయన హితవుచెప్పారు. ఆంధ్రాభవన్లో జరిగిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.