శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెలాఖరులోగా ప్రజా సాధికార సర్వేలో పేర్లు నమోదు చేసుకోండి:జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, అక్టోబర్ 25: ఈ నెలాఖరులోగా ప్రజా సాధికార సర్వేలో పేర్లు నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న తన ఛాంబర్‌లో మంగళవారం సర్వే చేస్తున్న విధానంపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో పేర్లు నమోదు చేసుకున్నందువల్ల ప్రభుత్వ రాయితీలను పొందవచ్చన్నారు. ప్రజాసాధికార సర్వే ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నెలాఖరులోగా సర్వే పూర్తిచేయాలన్నారు. సర్వేలో వివరాలు నమోదు చేసికోనివారు చివరి అవకాశంగా భావించి నిర్ధేశించిన ప్రాంతాలలో నమోదు చేసుకోవాలన్నారు. అలసత్వం ప్రదర్శించిన వారిపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.