శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

శ్రీసిటీలో గిడ్డంగుల నిర్మాణానికి భూమి పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఏప్రిల్ 22 : గిడ్డంగుల సదుపాయాల కల్పనలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జపాన్‌కు చెందిన నిపాన్ ఎక్స్‌ప్రెస్ అనుబంధ సంస్థ నిట్సు లాజిస్టిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ శ్రీసిటీలో ఓ భారీ గిడ్డంగి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. నిపాన్ ఎక్స్‌ప్రెస్ దక్షిణాసియా పసిఫిక్ మేనేజింగ్ డైరక్టర్ యసనూరి, తకా హర్షి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని భారతీయ సంప్రదాయాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిసాన్ ఎక్స్‌ప్రెస్, మిస్సులాజిస్టిక్స్ ప్రతినిధులతో పాటు శ్రీసిటీ ఎండి రవి సన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యసనూని తకా హర్షి మాట్లాడుతూ శ్రీసిటీలో వౌలిక వసతులతో పాటు తమకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. 22 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న ఈ గిడ్డంగి నిర్మాణం 2017 మార్చి నాటికి పూర్తవుతుందన్నారు. శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ గిడ్డంగుల సదుపాయాలు శ్రీసిటీ వ్యాపారాభివృద్ధికి మరింత ఉపయోగపడుతుందన్నారు. ఈ గిడ్డంగుల నిర్మాణ సంస్థ శ్రీసిటీకి రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. శ్రీసిటీతో పాటు ఈ ప్రాంతంలోని పరిశ్రమలు సమీపంలోని ఓడ రేవులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
.