శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కరెంట్ షాక్‌తో లైన్‌మెన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, జనవరి 19: విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తున్న లైన్‌మెన్ ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన గొల్లకందుకూరు సజ్జాపురం క్రాస్‌రోడ్డు సమీపాన చోటుచేసుకుంది. గ్రామాల్లో కరెంటు సమస్య వచ్చినప్పుడు లైన్‌మెన్ స్థానికంగా మరమ్మతులు చేస్తుంటాడు. అందులో భాగంగా శుక్రవారం గొల్లకందుకూరు సజ్జాపురం క్రాస్‌రోడ్డు సమీపాన కరెంటు సరఫరా లేదని స్థానిక రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు ముప్పరపు శివ (23) అనే ప్రైవేటు లైన్‌మెన్‌కు మరమ్మతుల బాధ్యత అప్పగించారు. మృతుడు సబ్‌స్టేషన్‌లో కరెంటును ఆఫ్ చేసి వైర్లు మరమ్మతులు చేస్తుండగా, ఒక్కసారిగా కరెంటు సప్లయ్ కావడంతో స్తంభం పైనుంచి కరెంటు తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.