శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్వర్ణ శోభిత చందనాలంకారంలో చెంగాళమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మార్చి 18 : సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం స్వర్ణ శోభిత చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి ఆలయ పాలక మండలి అధ్యక్షుడు ముప్పాళ్ల వెంకటేశ్వరరెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పంచాగ పఠన శ్రవణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ సందర్భంగా కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామలింగా చౌడేశ్వరిదేవి మహిళా సేవా సమితి వారు ఆలయంలో కూరగాయలతో వేసిన రంగువలులు అందరిని ఆకట్టుకున్నాయి.