శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వాహనం ఢీకొని మూడు జింకలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, మే 10 : గుర్తుతెలియని వాహనం ఢీకొని మూడు జింకలు మృతి చెందిన సంఘటన మండలంలోని సర్వేపల్లి - వెంకటాచలం రోడ్డుమార్గంలో మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సర్వేపల్లి - వెంకటాచలం రోడ్డుమార్గం మధ్య అడవి ఎక్కువగా ఉండటంతో జింకలు తాగునీటి కోసం రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో మూడు జింకలు తలోవైపు ఎగిరిపడటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాయి. అయితే ఈ ప్రమాదం రాత్రిపూట జరగడంతో జింక కళేబరాలు వేకువజాము వరకు రోడ్డుకు ఇరువైపులా పడి ఉన్నాయి. అటుగా వెళ్లే వాహనచోదకులు వెంకటాచలం ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాస్‌రావుకు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి చూసేసరికే జింక కళేబరాలు అదృశ్యమయ్యాయి. ఆయన ఈ విషయంపై ఫారెస్ట్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జింక కళేబరాలు రోడ్డుపైనే పడి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో వాటిని తీసుకుని వెళ్లి ఉంటారని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. జింక కళేబరాలను తీసుకునివెళ్లిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.