నెల్లూరు
ఉత్తర కాలువలో పడి బాలుడి గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 April 2016
ఆత్మకూరు, మార్చి 31: ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి గ్రామం వద్ద మదన్ అనే ఎనిమిది సంవత్సరాల బాలుడు సోమశిల ఉత్తరకాలువలో పడి గల్లంతయ్యాడు. గురువారం సాయంత్రం ఈ సంఘటన కలకలం రేపింది. సదరు బాలుడి తండ్రి రాజు పొగాకు కూలీగా పని చేస్తున్నాడు. వీరు గుంటూరు జిల్లావాసులు కాగా, రామస్వామిపల్లి వద్ద పొగాకు క్యూరింగ్ నిమిత్తం కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఉత్తరకాలువలో ఈత కొట్టేందుకు సహచర చిన్నారులతో వెళ్లిన ఇతడు గల్లంతయ్యాడు. ఈ సంగతి తెలియగానే అతని తల్లిదండ్రులు, స్థానికులు రాత్రి పొద్దుపోయే వరకు కూడా వెదుకులాడినా నీటి ప్రవాహంలో అతని జాడ కానరాలేదు.