శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, మే 17: పట్టణ పరిధిలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో గోమతీ సెంటర్ వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు పెళ్లకూరు మండలం పెనే్నపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు (38), మనోజ్ (25) పట్టణంలోని వాటర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నారు. సోమవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు జాతీయ రహదారిని దాటే సమయంలో తిరుపతి నుండి రాజమండ్రికి పూల లోడుతో వస్తున్న మినీ లారీ వీరిని ఢీకొంది. ఈ సంఘటనలో ఏడుకొండలు ఘటన స్థలంలో మృతి చెందగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది మనోజ్‌ను పేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించగా మంగళవారం ఉదయం మనోజ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.