శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి రవీంద్రారెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాకాడు, మే 20: తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి గండవరం రవీంద్రారెడ్డి (57) మృతి చెందారు. గత వారంరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఆయన గత కొనే్నళ్లుగా టిడిపిలో కొనసాగుతూ ఆయన వివిధ పదవులు చేపట్టారు. ప్రస్తుతం టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనది కోట మండలం తినె్నలపూడి గ్రామం. చురుకైన నాయకునిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండే వారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. తిరుపతి ఎంపి వరప్రసాద్, వైకాపా నాయకుడు పి మనోజ్‌కుమార్‌రెడ్డి, వాకాడు, కోట టిడిపి మండలాధ్యక్షులు డి మధుసూధనరెడ్డి, పి రాధాకృష్ణారెడ్డి, టిడిపి నాయకులు భాస్కరరెడ్డి, కృష్ణమూర్తి, పి కళ్యాణ్, వల్లీ ప్రసాద్, మర్రి పోలయ్య తదితరులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కోట మండల పరిషత్ అధ్యక్షులు నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, వాకాడు మండల పరిషత్ ఉపాధ్యక్షులు పి పురుషోత్తమరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, జడ్పిటిసి, ఎంపిటిసిలు, టిడిపి, వైకాపా, కాంగ్రెస్ పార్టీ నాయకులు గండవరం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.