శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు
వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయిన వృద్ధులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 May 2016
కావలి, మే 22: పట్టణంలోని ముసునూరుకు చెందిన వృద్ధులు ఎన్ శకుంతలమ్మ (80), కె రమణమ్మ (80) అనే ఇద్దరు ఆదివారం ఎండ ధాటికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులు నంబూరి వెంకట నారపరెడ్డి, కాటంరెడ్డి దామోదర్రెడ్డిలను పరామర్శించారు. ఆయన వెంట రాష్ట్ర సేవాదళ్ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మనె్నమాల సుకుమార్రెడ్డి, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్న, అధికార ప్రతినిధి పందిటి కామరాజు, కౌన్సిలర్లు డేగా రామయ్య, మందా శ్రీనివాసులు, కనపర్తి రాజశేఖర్, జంపాని రాఘవులు, పూనూరు శివకుమార్రెడ్డి, ఎం వెంకట రామిరెడ్డి తదితరులు వున్నారు.