శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వైభవంగా సాయిబాబా ఆలయ కుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 7 : సూళ్లూరుపేట పట్టణంలోని సాయినగర్‌లో ఉన్న సాయిబాబా ఆలయ మహా కుంభాభిషేకం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తికావడంతో నిర్వాహకులు కుంభాభిషేకంతో పాటు నూతనంగా సాయిబాబా అన్నప్రసాద విగ్రహాన్ని నిర్మించి ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి కలశాలలో కుంభాభిషేక జలాన్ని యాగశాల వద్ద పెట్టి వేదపండితులు, మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణాహుతి యాగాన్ని పూర్తిచేశారు. అనంతరం కలశాలలో ఉన్న జలాన్ని వేదపండితులు, మంత్రోచ్ఛరణలు, భక్తజన సందోహం నడుమ ఆలయం చుట్టూ ప్రదర్శనగా తీసుకెళ్లి ముందు ఆలయం మూలవిరాట్‌లో ఉన్న బాబా విగ్రహంపై కుంభాభిషేక జలాన్ని పోసి గోపురంపైన ప్రతిష్టించిన కలశాలపై పోశారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. మధ్యాహ్నం భక్తులు అన్నదానం చేశారు.