శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం గూడూరు ఆర్టీసీ డిపో నుండి విజయవాడకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకోసం గూడూరు, వాకాడు డిపోల నుండి ఆరు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. వీటితో పాటుగా గూడూరు మీదుగా పలు ఆర్టీసీ బస్సులను విజయవాడకు పుష్కరాల సందర్భంగా నడుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. జిల్లా నుండి పుష్కరాలకు వెళ్లే బస్సులు గోరంట్ల వరకు వెళతాయన్నారు. అక్కడ నుండి పుష్కర ఘాట్లకు ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. పుష్కరాలకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా చేరుకోవాలని ఆయన కోరారు.