శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రేపు పెన్నమ్మకు నదీ హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు కలెక్టరేట్, ఆగస్టు 16: జిల్లా కేంద్రంలోని తల్పగిరి రంగనాథస్వామి క్షేత్రం సమీపంలోని తీర్థఘట్టం వద్ద గురువారం భక్తులు పుష్కర స్నానమాచరించాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే విశిష్ట పినాకిని (పెన్నా) నదికి ప్రతి ఏడాది పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. దేవస్థాన నిర్వాహకులు భక్తులకు మహా హారతులు ఏర్పాటు చేశారని భక్తులు తిలకించి స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.