శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బోటు భూముల సేకరణ తాత్కాలికంగా నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఆగస్టు 19: మండలంలోని రామదాసుకండ్రిగ పంచాయతీ పరిధిలోని నాయుడుపాళెం గ్రామంలోని బోటు భూములను ఏపిఐఐసి ద్వారా సేకరణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించారు. శుక్రవారం వెంకటాచలం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన జెసి విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల బోటు భూములపై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతోపాటు వివాదాస్పదం కావడంతో ప్రస్తుతానికి ఈ భూముల కేటాయింపు నిలిపివేతకు చర్యలు తీసుకున్నామని, మరొక చోట పరిశ్రమల ఏర్పాటుకు భూమి చూపనున్నట్లు వివరించారు. దీంతోపాటు మండలంలో రేషన్ సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని, రేషన్ కార్డుల్లో తప్పులు లేకుండా సవరణ చేయాలని వెంకటాచలం తహశీల్దార్ సుధాకర్‌కు ఆయన సూచించారు. రెవెన్యూ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.