శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రూ.70లక్షలతో చీటీల వ్యాపారి పరార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, సెప్టెంబర్ 1: పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో చీటీల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ కుటుంబం సుమారు 70లక్షల రూపాయలతో సభ్యులకు తెలియకుండా పట్టణం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ ప్రాంతంలోనే వారికి స్వంత నివాస భవనం ఉండగా ఎవరికి తెలియకుండా దానిని సైతం అమ్మివేసి చల్లగా జారుకున్నట్లు ఆలస్యంగా గుర్తించిన చీటీలు వేసే వారు ఏమిచేయాలో పాలుపోనిస్థితిలో లబోదిబోమంటున్నారు. ఒకరికొకరు తెలుసుకొని చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతుండగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకొని ఆ మేరకు శుక్రవారం కేసు పెట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది.