శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పెంచలకోనలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, సెప్టెంబర్ 13: జిల్లాలో ప్రముఖ ఆలయమైన పెంచలకోన దేవస్థానంలో నాలుగు రోజులపాటు జరగనున్న పవిత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి శుక్రవారం జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అంకురారోహణ, శ్రీవారికి అభిషేకం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా పెంచలకోన ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ అమర శ్రీరాములశ్రేష్టి, వసుందరమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి కనులారా వీక్షించారు. ఇక్కడకు విచ్చేసిన వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆలయ సహాయ కమిషనర్ శనగవరపు శ్రీరామమూర్తి పర్యక్షించారు.