క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మృతుడు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పీఏ
* పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తూ మృతి
డిచ్‌పల్లి, ఏప్రిల్ 5: దర్పల్లి మండల కేంద్రానికి చెందిన పి.బాలగంగాధర్, ఆయన సతీమణి విజయలు గురువారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దర్పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. దీంతో మృతుడు కుటుంబీకులు, బంధువులు, చిన్ననాటి స్నేహితులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో 1985లో దర్పల్లి మండల అధ్యక్షుడిగా పనిచేసిన బాలగంగాధర్, 1990ప్రాంతంలో కండక్టర్ ఉద్యోగంలో చేరారు. దీంతో మాజీమంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు వద్ద సుమారు 15సంవత్సరాల పాటు వ్యక్తిగత సహాయకుడిగా కొనసాగారు. అదేవిధంగా జుక్కల్ ఎమ్మెల్యే గంగారాం వద్ద పనిచేసిన బాలగంగాధర్, ప్రస్తుతం రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పీ.ఏగా వ్యవహరిస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. బాలగంగాధర్ దంపతులు మృతి చెందిన విషయం తెలుసుకున్న రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.