నిజామాబాద్

ఎంపిడిఓపై డ్వామా పిడి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, ఏప్రిల్ 26: కలెక్టర్ చెప్పింది వినలేరా, అలా చెప్పావేంటి అంటూ డ్వామా పిడి వెంకటేశ్వర్లు మాక్లూర్ ఎంపిడిఓ సక్రియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని గొట్టిముకుల గ్రామంలో ఇజిఎస్, ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నేషనల్ రూరల్ లైఫ్ ఉడ్ మిషన్ ద్వారా ఎస్‌హెచ్‌జి గ్రూప్‌లకు ఢిల్లీకి చెందిన నాలెడ్జ్ సంస్థ వారు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ సక్రియా మాట్లాడుతూ, మరుగుదొడ్లను ఎవరికి వారే నిర్మించుకోవాలని, ఆ తర్వాత బిల్లులు చెల్లిస్తామంటూ పేర్కొన్నారు. దీంతో పక్కనే ఉన్న డ్వామా పిడి వెంకటేశ్వర్లు వెంటనే మైక్ అందుకుని ప్రజలు ఇలా ఎందుకు తప్పుదోవ పట్టిసారు, కలెక్టర్ చెప్పిన విషయాలు వినలేదా, అసలు మీరు సమావేశాలకు హాజరవుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు మరుగుదొడ్లు నిర్మించుకోవడం కుదరదని, ప్రభుత్వమే కట్టించి ఇస్తుందని తెలిపారు. ఎంపిడిఓ చెప్పినట్లు చేస్తే బిల్లులు వచ్చే అవకాశం ఉండదన్నారు.