నిజామాబాద్

చివరి రక్తబొట్టు వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, జూలై 17: చివరి రక్తబొట్టు వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మండలంలోని రామేశ్వర్‌పల్లి రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానని అసత్య ప్రచారం చేస్తున్నానని, తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తెల్చి చెప్పడంతో సమావేశానికి హాజరైన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కరాచాల ధ్వనులు చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న తనకు అన్ని రకాలుగా అండగా నిలిచిందని, అటువంటి పార్టీని వీడి తాను టిఆర్‌ఎస్‌లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.