నిజామాబాద్

చెరువులో పడి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, అక్టోబర్ 28: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పాత బాన్సువాడకు చెందిన నీరడి అంజవ్వ(35)అనే మహిళా తన ఇద్దరు (కవలలు) పిల్లలైన గౌతమి(8), గాయిత్రీ(8)లతో కలిసి బాన్సువాడ కల్కి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బాన్సువాడ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాత బాన్సువాడకు చెందిన అంజవ్వ తరుచూ భర్తతో గొడవ పడేదని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో గురువారం ఇంట్లో భర్తతో గొడవ పడిన అంజవ్వ, సాయంత్రం సమయంలో సంతకు వెళ్తానని తన ఇద్దరు కుమార్తెలతో వెళ్లిందన్నారు. రాత్రి వరకు అంజవ్వతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు చుట్టు పక్కల వారి ఇళ్లలో, పాతబాన్సువాడలో గాలించినా ఫలితం లేకుండాపోయిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో కల్కి చెరువుకట్ట వద్దకు వెళ్లి చూడగా, చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టడం జరిగిందని పోలీసులు తెలిపారు. సాయంత్రం సుమారు 7గంటల సమయంలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయని, శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించామని ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఇదిలా ఉండగా, పాతబాన్సువాడలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడటంతో విషాదఛాయలు అలముకున్నాయి.