నిజామాబాద్
నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 15 November 2016
కంఠేశ్వర్, నవంబర్ 14: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున 5గంటలకు ఎంపి కవిత ఆలయానికి చేరుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖఃసంతోషాలతో ఉండాలని గతంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామిని కోరుకోవడం జరిగిందని, అందుకే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా పుష్కలంగా వర్షాలు కురియడం జరిగిందన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం వర్షాలు కురిస్తే తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎంపి వెంట ఆమె కుటుంబ సభ్యులున్నారు.