AADIVAVRAM - Others

మనసులేని తనం (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన యుగాల్లో మన పురాణాల్లో జనక మహారాజును గొప్ప జ్ఞానిగా భావిస్తాం. ఆయన మహారాజయినా నిత్యం తత్వ చింతనలో, జ్ఞాన చర్చల్లో మునిగి ఉండేవాడు. దేశదేశాల నుండి ఆయన దర్శనం కోసం ఎందరో మహా పురుషులు వచ్చేవాళ్లు.
నిరంతర జ్ఞాన చింతనతో, బ్రహ్మజ్ఞాన అనే్వషణలో జనక మహారాజు మునిగి ఉండేవాడు. దేనినయినా, ఎప్పుడయినా వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ప్రపంచ అశాశ్వతత్వాన్ని తెలిసిన మహాజ్ఞాని ఆయన.
ఆయనలో జ్ఞానతృష్ణ అపారం. అనంతం. అంతిమ సత్యం గురించి నిరంతర అనే్వషణలో మునిగి ఉండేవాడు.
ఒకసారి ఆయన దేశమంతా ఒక ప్రకటన చేశాడు. దేశంలోని పండితుల్ని, వేదాంతుల్ని, తత్వవేత్తల్ని కవుల్ని ఆహ్వానించాడు. గొప్ప జ్ఞాన సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ రోజు వచ్చింది. వేల మందితో సభ కిటకిటలాడుతోంది.
జనకుడు మాట్లాడ్డం మొదలుపెట్టాడు. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. జనకుడు ‘మీలో ఎవరయినా నాకు జ్ఞానోపదేశమివ్వాలి. ఎలా అంటే నేను గుర్రం ఎక్కి ఒక నాడాలో కాలుపెట్టి, తరువాత ఇంకో నాడాలో కాలు పెట్టేలోగా నాకు జ్ఞానోపదేశం చెయ్యాలి’ అన్నాడు.
సభలోని వారంతా నిశే్చష్టులయ్యారు. ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే క్షణకాలంలో జ్ఞానోపదేశం చెయ్యడమంటే ఎలాగో ఎవరికీ తోచలేదు.
జనక మహారాజు ‘మీలో ఎవరయినా నాకు జ్ఞానోపదేశం చెయ్యడానికి ముందుకు రండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. కేవలం శాస్త్ర జ్ఞానంతో పాండిత్య ప్రకర్షతో మీ ప్రతిభ ప్రదర్శించకండి. మీరు చెప్పేది అనుభవపూర్వకంగా ఉండాలి. హఠాత్ సంభవానికి అది అనుకూలంగా ఉండాలి’ అని సమస్యను మరింత సంక్లిష్టం చేశారు.
జనక మహారాజుకు జ్ఞానోపదేశం కలిగించడమంటే, బ్రహ్మను భూతి కలిగించడమంటే మామూలు విషయం కాదు. అటువంటి వ్యక్తి ఆయన్ని మించిన జ్ఞాని అయి ఉండాలి. సభ నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ ముందుకు రాలేదు. ఇక సభ ముగుస్తుందని అందరూ అనుకున్నారు.
అష్టావక్రుడను మహాముని లేచి ‘జనక మహారాజా నేను మీకు జ్ఞానోపదేశం కలిగిస్తాను’ అన్నాడు.
ఒక మహాజ్ఞాని తన రాజ్యంలో వున్నాడన్న నమ్మకం జనక మహారాజుకు కలిగింది. నేను సిద్ధం అన్నాడు. అష్టావక్ర ముని ‘రాజా! జ్ఞానోపదేశం అన్నది సభ మధ్యలో, జనం మధ్యలో చేయదగింది కాదు. ఏకాంత స్థలంలో చేయదగింది. మనం సమీప అరణ్యంలోకి వెళదాం’ అన్నాడు. సరేనని జనక మహారాజు కొంతమంది సైనికులతో, అష్టావక్రునితో అరణ్యం వేపు వెళ్లాడు.
సైనికుల్ని ఒక దగ్గర వదిలి అష్టావక్రుడు, జనక మహారాజు అరణ్యం లోపలికి వెళ్లి ఒక నిర్జన ప్రదేశంలో ఆగాడు.
జనక మహారాజు ‘అష్టావక్రా! నేను గుర్రం ఎక్కాను. ఇంకో కాలు ఇంకో నాడాలో పెట్టేలోగా నువ్వు నాకు జ్ఞానోదయం కలిగించాలి’ అన్నాడు.
అష్టావక్రుడు ‘తప్పకుండా మహారాజా! అయితే ముందుగా మీరు నాకు గురుదక్షిణ చెల్లించాలి’ అన్నాడు. మహారాజు ‘తప్పక అడగండి’ అన్నాడు.
అష్టావక్రుడు ‘మీ మనసును నాకివ్వండి’ అన్నాడు. జనక మహారాజు తన మనసును అష్టావక్రుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసిన మరుక్షణం ఆయన అచేతనంగా గుర్రం మీద పడిపోయాడు. అష్టావక్రుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఎంత సేపటికీ రాజు రాకపోయేసరికి సైనికులు అరణ్యం లోపలికి వచ్చి వెతికారు. గుర్రం మీద అచేతనంగా పడి ఉన్న జనక మహారాజును చూశారు. అష్టావక్రుడు అక్కడ లేడు. అష్టావక్రుడేదో మంత్రం వేశాడని, అతన్ని వెతకడానికి వెళ్లి అష్టావక్రుణ్ని చూశారు. విషయం చెప్పారు. అష్టావక్రుడు వచ్చి జనకమహారాజును తాకాడు. మహారాజుకు స్పృహ వచ్చింది.
మనసు ప్రాపంచికమైంది. మనసు ప్రపంచమిచ్చింది. అది ఆత్మకు అడ్డంగా ఉంటుంది. అది మాయమయితే ఆత్మ ముందుకు వస్తుంది. ఆత్మ ఆవిష్కారమవడమంటే జ్ఞానోదయం కలగడమే.
ఆ సత్యం తెలిసి వచ్చి మహారాజు అష్టావక్ర మునికి అభివాదం చేశాడు.
*

- సౌభాగ్య, 9848157909