Others

టాలీవుడ్ వీళ్లకైనా.. కలిసొస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ సినిమా చరిత్రలో బాలీవుడ్ తరువాత రెండో స్థానంలో వుంది టాలీవుడ్. ఇక సినిమాల నిర్మాణ విషయంలో ఎప్పుడూ ముందుండే తెలుగు సినిమాల్లో నటించేందుకు సదరు నటీనటుల ఆసక్తి ఎక్కువే. అయితే వీరిలో కథానాయికలు ఎప్పుడూ ముందుంటారు. తెలుగు ప్రేక్షకులకు కూడా బాలీవుడ్ భామలంటే అదో క్రేజ్. అందుకే ఎక్కువ మొత్తం పెట్టి వారిని తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం చేస్తారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య టాలీవుడ్‌కి మలయాళ భామల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే అరడజనుకుపైగా హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకుని ఆకట్టుకుంటున్నారు. అయితే తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇతర భాషా నటీమణులకు చక్కటి ఆహ్వానం లభిస్తోంది. మలయాళం, తమిళం, కన్నడ, హిందీ వారు తెలుగులో సినిమాలు చేసి తెలుగు హీరోయిన్స్‌గా ఇమేజ్ తెచ్చుకున్నవారే. అయితే కొంతమంది బాలీవుడ్ బ్యూటీలు ఎంత కష్టపడ్డా, తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. మరి కనీసం ఇప్పుడు వస్తున్న కథానాయికలైనా టాలీవుడ్‌లో నిలబడతారో లేదో చూడాలి..
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ని సైతం తన వైపునకు తిప్పుకున్న అందాల భామ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు ఎలాంటి క్రేజ్ వుందో అందరికీ తెలుసు.. అయితే ఆమె తెలుగులో నటించేందుకు ఆమధ్య ఆసక్తి చూపించింది. కానీ పెద్దగా ఆకట్టకోలేకపోవడం విశేషం.. ఆమధ్య మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ చేసిన హిందీ చిత్రం ‘జంజీర్’. దీన్ని తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేశారు. అయితే చరణ్ సరసన నటించిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆ సినిమాతో సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఆమెకు తెలుగు అవకాశాలు రాలేదు. ఇక మరో క్రేజీ భామ బిపాసా పరిస్థితి అలాగే వుంది. హాట్ అందాలు ఆరబోస్తూ షాకిచ్చిన బిపాసా కూడా తెలుగులో మహేష్ సరసన ‘టక్కరిదొంగ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో మరో బాలీవుడ్ భామ లిసారే కూడా మెరిసింది. కానీ ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవడంతో పాపం.. ఈ ఇద్దరు భామల కష్టాలు వృథా అయ్యాయి.
ఇక మరో హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న కంగనా రనౌత్‌ది అదే పరిస్థితి. ప్రభాస్ పక్కన ‘ఏక్‌నిరంజన్’ సినిమాలో నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా హిట్ కాకపోవడంతో పాపం కంగనా ఆశలు అడియాశలయ్యాయి. అప్పట్లో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ట్వింకిల్‌ఖన్నా పరిస్థితి కూడా అలానే మారింది. వెంకటేష్ సరసన ‘శీను’ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ట్వింకిల్‌కు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేయలేదు. ఇక తెలుగు భామ అయివుండి, బాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్న అమృతారావుది అదే పరిస్థితి. సూపర్‌స్టార్ మహేష్ సరసన అతిథిలో నటించింది. అయినా ఈ అమ్మడి అందాలకు తెలుగువారు ఫిదా కాలేదు.
ఇక అప్పట్లో క్రేజీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఒక ఊపు ఊపిన మనీషా కొయిరాలది అచ్చంగా అలాంటి పరిస్థితే. నాగార్జున సరసన ‘క్రిమినల్’ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా విజయం అందుకోకపోవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఈ లిస్టులో చూసుకుంటే.. అయేషా టకియా నాగార్జున తో ‘సూపర్’లో నటించింది. పూరీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిరాశపర్చడంతో అయేషా ఇంటిబాట పట్టింది. ఇక బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న శిల్పాశెట్టి (మోహన్‌బాబు సరసన వీడెవడండీ బాబు).. ఆమె చెల్లెలు షమితా శెట్టి (ఆకాష్ సరసన పిలిస్తే పలుకుతా)లది అదే పరిస్థితి. వీరితోపాటు మరికొందరి భామలది అదే పరిస్థితి. పూరీ పరిచయం చేసిన దిశాపటాని (వరుణ్‌తేజ్‌తో లోఫర్), ఆదాశర్మ (హార్ట్‌ఎటాక్) వంటి తారలు.. టాలీవుడ్‌లో రాణించలేకపోయా రు. ఒక్క సినిమాతోనే వెనుతిరిగారు. ప్రస్తుతం బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘సాహో’లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మహేష్ సరసన ఖైరా అద్వానీలు నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ భామలు టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటారో లేదో చూడాలి!

-శ్రీనివాస్ ఆర్.రావ్