Others

‘అమ్మా అమ్మా అని పిలిచావు...’ (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విచిత్ర బంధం’ సినిమాలో ‘అమ్మా అమ్మా అని పిలిచావు...’ అనే ఈ పాట వాణిశ్రీ మీద చిత్రీకరించారు. కథాపరంగా అక్కినేని ద్వారా బిడ్డను కన్న వాణిశ్రీ విధివంచితురాలై ఆ బిడ్డకు దూరంగా ఉంటుంది. అక్కినేని కలపాలనుకుంటాడు వాళ్ళిద్దరిని. యాదృచ్ఛికంగా ఆ తల్లీకొడుకు అక్కినేని దగ్గర ఆశ్రయం పొందుతుంటారు.
ఒకానొక సందర్భంలో వాణిశ్రీ తన మాతృ హృదయపు ఆవేదనను ఆ బాబు దగ్గర వ్యక్తపరుస్తుంది.
‘అమ్మా అమ్మా అని పిలిచావు ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ- ఏ తల్లి కన్నబాబువో నా కాళ్లకు బంధం అయినావు...’ ఇక్కడే మనకు కథంతా అర్ధమవుతుంది. ఆత్రేయగారి సాహిత్యమా మజాకానా మరి కె.వి.మహదేవన్ పక్కనే ఉండగా ఆ పాట అమ్మతత్వాన్ని పొందుతుంది. ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వం ఇక పాట పండక ఏమవుతుంది.
కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వూ, కడుపు తీపి తీరని తల్లిని నేను- కాలమే ఇద్దరినీ కలిపింది ఎందుకో-ఒకరికొరతనింకొకరు తీర్చుకునేటందుకో. చూడండి చిన్నచిన్న పదాలతో ఎంత విపులంగా చెప్పారో కవిగారు. వాణిశ్రీ కూడా అంతే భావగర్భితంగా నటించింది. మోడులా ఈ బ్రతుకును మోశానూ నీ ముద్దుమోముచూసి మరల మొలకెత్తాను’ అంటుంది. కన్నబిడ్డ అని తెలియకపోయినా ఆదరిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. అమ్మ ఎవరికైనా అమ్మ అని నిరూపిస్తుంది. చక్కగా మనసుని సేదతీర్చే ఈ పాట నాకు ఎంతో ఇష్టం. నా ఫోన్‌లో అప్పుడప్పుడూ మోగుతూనే ఉంటుంది. నన్ను అలరిస్తూనే ఉంటుంది.
- అన్నదాత దయాకర్, బృందావనం, నెల్లూరు