AADIVAVRAM - Others

తిరుమల క్షేత్ర విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తిరుమల ఆలయం దాదాపు 2.2 ఎకరాల విస్తీర్ణంలో, 413 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. గర్భాలయం పొడవు 12.9 అడుగులు, వెడల్పు 12.9అడుగులు.
* శ్రీవారి ఆలయం సముద్రమట్టానికి 2980 అడుగుల ఎత్తులో ఉంది.
* రాచరికాలు అంతమయ్యే వరకు శ్రీవారి ఆలయం భక్తులైన చక్రవర్తులు, పాలకుల ఏలుబడిలో నడిచింది. తరువాత కొంతకాలం పాటు అర్కాటు నవాబు, ఆపైన ఈస్టిండియా కంపెనీల చేతుల్లోకి మారింది. ఆంగ్లేయుల హయాంలో 1933లో టీటీడీ ఏర్పడింది.
* ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు స్వామి సేవలో పాలుపంచుకున్నారు. ముప్పై రెండు వేల సంకీర్తనలతో స్వామిని కీర్తించిన పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు, త్యాగరాజు, అక్బర్‌తో పాటు ఎందరో రాజులు, రాణులు, తెల్లదొరలు, మహంతులు స్వామివారి వైభవాన్ని చాటినవారే.
* దేవాదాయ ధర్మాదాయ చట్టపరిధిలో భారతదేశంలోని 40 ఉప ఆలయాలు కలిగిన పెద్ద ఆలయం టీటీడీ.
* రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన అధ్యక్ష, 14మంది మండలి సభ్యుల టీటీడీ ట్రస్ట్‌బోర్డు నేతృత్వంలో పాలన సాగుతోంది.
* తిరుపతి, తిరుమలలో సుమారు 8వేల వసతీ గదులతో రోజుకు 60వేల మంది యాత్రికులకు టీటీడీ బస కల్పిస్తోంది.
* టీటీడీలో 48విభాగాలు, 11వేల మంది ఉద్యోగులు, 10వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.
* టీటీడీ కరెంటు బిల్లు సంవత్సరానికి 28కోట్ల రూపాయలు
* తిరుమలలో టోపీల వ్యాపారం మహాజోరుగా సాగుతుంది. అనధికార అంచనాల ప్రకారం రోజుకు 10లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది.
* శ్రీవారి ఆలయంలోని ఆనందనిలయం ప్రాకారంపై సుమారు 60 శాసనాలు ఉన్నట్లు పురావస్తుశాఖా నిపుణులు గుర్తించారు. ఇందులో 43 తమిళం, 8 తెలుగు, 7కన్నడం, మరో 2 హిందీలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.