Others

కవితల పోటీకి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిసంధ్య సాహిత్య సాంస్కృతిక సంస్థ, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ దాట్ల దేవదానం రాజు ఒక ప్రకటనలో తెలిపారు. సమకాలీన వస్తువు, ఆధునిక భాష, అభివ్యక్తితో కూడిన వచన కవితలు మాత్రమే పోటీకి పరిశీలించబడతాయ. ఈ పోటీలో పాల్గొనదలచినవారు రూ.200 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. పోటీలో బహుమతి పొందని వారి ఎంట్రీ ఫీజు కవిసంధ్య సంవత్సర చందాగా పరిగణించి ఆరు సంచికలు పంపబడతాయ. హామీ పత్రంలో మాత్రమే కవి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఇ-మెయల్ వివరాలు పొందుపరచి కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలి. ఈ పోటీలో మొదటి బహుమతి రూ.3000, రెండవ బహుమతి రూ.2000, మూడవ బహుమతి రూ.1000, పది మంచి కవితలకు రూ.500 చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఉంటాయ. 21 మార్చి 2019న యానాంలో జరిగే ప్రపంచ కవితా దినోత్సవ సభలో ప్రదానం చేయడం జరుగుతుంది. కవితలు పంపడానికి చివరి తేదీ 30 జనవరి 2019. చిరునామా: దాట్ల దేవదానం రాజు, ఉపాధ్యక్షులు కవిసంధ్య, 8-1-048, జక్రియనగర్, యానాం - 533 464, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వివరాలకు సెల్: 9440105987, 8555830789.