Others

హితవాక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాణహాని వచ్చు పట్టున సర్వధ
నాపహార వేళయందు నడపు
సత్యమనృతమండ్రసత్యంబు నూనృత
మని పరిగ్రహింతు రార్యజనులు
అది దీయందనాల తిక్కన భారతి

కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఒకరోజు ధర్మరాజు కర్ణునిచేతిలో పరాభూతుడయ్యాడు. అవమానభారంతో కుమిలిపోతున్నాడు. కర్ణుని విజృంభణాన్ని చూసి జంకి రాజు మరింత వ్యథతో ముందు వెనుకలాలోచించక ‘‘తమ్ముడా!్భయపడి పారివచ్చావా?నీ గాండీవాన్ని కృష్ణునికి ఎరువుగా ఇచ్చినా బాగుండేది! అతనే శత్రువుల్ని తుదముట్టించేవాడు. ’’అని పరుషంగా పలికాడు. పార్ధుడు తోకపై తొక్కిన తాచులా ఉగ్రుడై అన్నపైకి కత్తిదూయబోతుండగా కృష్ణుడతన్ని నివారించాడు. కానీ అర్జునుడు తన ధనస్సును పరులకిమ్మనే వాని శిరస్సును ఛేదిస్తానని ప్రతిజ్ఞచేశానని, అది నెరవేర్చక పోతే అసత్యదోషం వచ్చిపడుతుందని చెప్పి దాన్ని పరిష్కరించుమని వేడుకున్నాడు. అప్పుడు జగత్కృత్యసాకల్యవేది శ్రీకృష్ణుడిలా ఉపదేశించాడు.
‘‘ఓరుూ!పార్థా! ధర్మము యొక్క సూక్ష్మస్వరూపం చాలాచిత్రమైంది. ప్రాణాలకే హాని సంభవించే సమయంలో సమస్త సంపదలు అపహరించబడే తరుణంలో అసత్యం పలికినా అది సత్యమే ఔతుం.ది అట్టివేళలలో సత్యం పలికినా అది అబద్ధం గానే పరిగణింపబడింది. కనుక ధర్మరక్షణకోసం ఏ మార్గాన్ని అనుసరించినా అది ఆమోదించదగిందిదే. ధర్మం తప్పకుండా, నీతి తప్పకుండా ఉంటే మేలు కానీ కావాలని పరులను హింసించడానికి అబద్ధం చెప్పినా, పరహింస చేసినా అది తప్పు అవుతుంది.

-వ్యాఖ్యాత:డి.ఎన్.దీక్షిత్