AADIVAVRAM - Others

ఇక స్కైటాక్సీల కాలమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు టెక్ కంపెనీలు సరికొత్త పరిష్కారాలతో ముందుకొస్తున్నాయి. గగనతలంలో రివ్వున దూసుకెళ్లే స్కై టాక్సీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలోనే ఈ టాక్సీలను అందుబాటులో తెచ్చేందుకు దుబాయి సిద్ధమవుతోంది. 2019 మొదటి మూడునెలల్లోనే పైలెట్ రహిత ఎయిర్ టాక్సీలను గగనతలంలో పరీక్షించేందుకు జర్మనీకి చెందిన స్టార్టప్ సంస్థ వోలోకాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. అందుకు దుబాయి రవాణా శాఖ అనుమతులు ఇచ్చింది. ఇద్దరు ప్రయాణికులను సులువుగా తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఎయిర్ క్రాఫ్ట్‌లను వోలోకాపటేర్ తయారుచేస్తోంది. ఈ స్కై టాక్సీలు గరిష్ఠంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలిలో ప్రయాణించగలవని ఆ సంస్థ చెబుతోంది. అరగంట సేపు గాలిలో తిరిగేందుకు వీలుగా తొమ్మిది బ్యాటరీలు ఉంటాయి. ఈ టాక్సీల్లో భద్రతకు ఎలాంటి డోకా ఉండదని తయారీ సంస్థ చెబుతోంది. ఒకవేళ సాంకేతికంగా ఏదైనా సమస్యలు తలెత్తితే ఈ టాక్సీ దానంతట అదే లాండ్ అవుతుందట. అలాగే.. చైనాకు చెందిన డ్రోన్ తయారీ సంస్థ ఇహంతోనూ దుబాయి రవాణా శాఖ కలిసి పనిచేస్తోంది. ఒకరిని తీసుకెళ్లగలిగే ఇహంగ్ 184 పైలెట్ రహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ను పరీక్షిస్తోంది. ఇది ఎక్కడికైనా సులువుగా లాండవుతుందని చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఎలివేట్ పేరుతో ఉబర్ ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీ ప్రాజెక్టును ప్రారంభించింది. 2023లోగా తొలి 50 ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. వాహనం పేరుతో ఎయిర్‌బస్ ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారుచేస్తోంది. ఇవి నాలుగు నుంచి ఆరుగురిని తీసుకెళ్లగలవు.
గగనతలంలోనైనా టాక్సీలో ఛార్జీలు తక్కువేనని ఉబర్ చెబుతోంది. ప్రస్తుతం ఉబర్ ఎక్స్ కాబ్ ఛార్జీలతో సమానంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే బ్యాటరీలతో ఈ టాక్సీలు ఎంత దూరం నడుస్తాయన్న విషయంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ టాక్సీలో ఉపయోగించనవన్నీ మెరుగైన బ్యాటరీలని, వీటితో ఏ రకమైన సమస్యలు ఉండవని ప్రతినిధులు చెబుతున్నారు. ఈ గగనతల టాక్సీలు వస్తే ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ ఓ సవాలుగా మారుతుంది. సిగ్నలింగ్ వసతులూ మెరుగుపడాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం.. సైన్స్ అండ్ అవైడ్ అనే సాంకేతికతను నాసా అభివృద్ధి చేస్తోంది. దాంతో పైలెట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్‌ల మధ్య సమాచార మార్పిడి జరుగుతుందని, ప్రమాదాలను నివారించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా మరో మూడు నాలుగేళ్లలో ఈ గగనతల టాక్సీలను అందరూ చూసే అవకాశం రావచ్చు.

-మహి