Others

తెలుగు సంస్కృతికి ప్రతీక సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న క్షీరధార హైందవ సంస్కృతి. ఆ పాలవెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలే మన సాంప్రదాయాలు. హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు ‘పండగ’ కేంద్ర బిందువు.
పండుగలు పురాణేతిహాస, రుతు సంబంధాలు, శీతోష్ణస్థితుల, సామాజిక జీవన విధానాధారాలుగా ఏర్పడ్డాయి. ప్రతి పండగలో పరమార్థం ఉన్నందునే అవి సాంప్రదాయాలుగా మారాయి. డోలు సన్నాయి వాద్యాలు, వాటి రాగాలకు అనుగుణంగా విన్యాసాలు చేసే అలంకృత గంగిరెద్దులు, హరిలో రంగ హరీ అంటూ, నడినెత్తి నుండి నాసిక దాకా తిరుమణి శ్రీచూర్ణ పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా, బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా, చిందులుతొక్కే హరిదాసులు, అడుగడుగునా ముంగిళ్లలో రంగుల ఆకృతులు, భోగిమంటలు, కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, బొమ్మల పండుగలతో కలబోసిన గ్రామీణ సుందర మనోహర దృశ్యాలు తెలుగు వారికే ప్రత్యేకమైన సాంప్రదాయ ప్రతీకలు. ‘‘చాంద్రమానం‘‘ పాటించే తెలుగువారు ‘‘సౌరమానం’’ ప్రకారం జరిపే పండుగ ‘‘సంక్రాంతి’’. ‘‘తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేశు సంచరత: సూర్యస్య పూర్వస్మ్రాద్రాశే ఉత్తర: రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి’’. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది భోగి పండగ.
ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు. మకర సంక్రమణానికి పూర్వపు రోజు భోగి. గోదాదేవి తిరుప్పావై రచన పూర్తి చేసిన ముప్పయవ నాడు రంగనాధుడు ప్రత్యక్షమై, ఆమెను వివాహమాడతానని, సకల భోగాలు సమకూరుస్తానని చెప్పి, వివాహమాడగా, వివాహ తంతు పూర్తికాగానే ఆమె స్వామి వారిలో ఐక్యం పొందుతుంది. అందుకే ‘‘్భగి’’ అని ఈ పర్వదినానికి పేరు. జన సామాన్యానికి భోగ భాగ్యాలు ఇచ్చే రోజని ప్రతీతి. భోగినాడు మేఘాధిపతియైన ఇంద్రపూజ చేయడం అనవాయితీ. భోగినాడు ఈనాడు భోగిపీడ నివారణకై తెల్లవారగానే అభ్యంగన స్నానం చేయడం విధాయకకృత్యం. చంటిపిల్లలకు తలంటుపోసి, భోగి పళ్ళు పోయడంతో దృష్టి పరిహారం చేస్తారు. కొత్త బట్టలు కట్టి, కుర్చీలో కూర్చుండచేసి, రేగు పళ్ళు, పైసలు, చెరుకు ముక్కలు, బోడికలు దిగువార బోస్తారు. రంగవల్లులు ధిద్దుతారు.. గొబ్బెమ్మలను పెడతారు. మకర సంక్రాంతి సూర్యుడు ఉత్తర గతుడు కావడంతో ఉత్తరాయణ ప్రవేశమవుతుంది. ఉత్తరాయణం దేవ కర్మలకు అర్హమైన కాలం. ఈ ఆయనంలో మృతి చెందిన వారు పుణ్యాత్ములై, సూర్య సాయుజ్యం పొందగలరని వేదవచనం. సూర్య సంచారమును బట్టి ఏర్పడిన పండుగ. ఆడపిల్లలు తెల్లవారు జామున లేచి పెట్టే గొబ్బిళ్ళు, ఆర్ష కర్మలలో ప్రాముఖ్యం కలిగిన కళాభిజ్ఞత ఉట్టిపడే ముగ్గులు, పళ్ళ నైవేద్యాలు, బాజా భజంత్రీల వాద్యాలు ఎక్కడ చూసినా ఈనాడు దర్శనమిస్తాయి. రెండవనాడు జరిపే మకర సంక్రాంతి అత్యంత పురాతనమైనది. సంక్రాంతినాడు గంగలో స్నానం చేసి, బ్రాహ్మణునికి పెరుగు దానం చేయాలనే నియమాన్ని పాటించిన యశోదకు ‘‘కృష్ణుడు’’ జన్మించాడని దుర్వాస ముని ద్వారా వివరింపబడి, ఆయన సూచనపై, ద్రోణాచార్యుని సతి కృపి సంక్రాంతి పర్వాన్ని జరిపి, పెరుగుదానం చేయడం ద్వారా ‘‘అశ్వత్థామ’’కు జన్మనిచ్చినట్లు పురాణ కథనం. ఈ సందర్భంగా నువ్వుల ముద్దలతో నలుగు పెట్టుకుని, తలంటి స్నానాలు చేసిన ముత్తయిదువలు, అలంకృతులై ఐదు మట్టి ముంతలు పుచ్చుకుని, ఒక్కొక్క ముంతలో బియ్యం, పప్పుదినుసులు, చెరుకు, క్యాబేజి ముక్కలు, రేగుపళ్ళు, నువ్వులు ఉంచి. మూకుడు మూతతో ఉంచి ఎరిగిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఇస్తారు. నువ్వులతో చేసిన భక్ష్యాలతో భోజనం చేస్తారు. ఈనాడు సూర్యుని ఆరాధించి, తిలలు, కూష్మాండాలు, భాండాలు, కంబళి, ధాన్యాలు, లోహాలు, వస్త్రాలు, తైల దీపాలను దానం చేయాలని శాస్త్ర వచనం. భోజనానికి బంధుమిత్రులు ఆహ్వానించడం, నూతన వస్తధ్రారిణులైన ముత్తయిదువలు పంచదారలో నువ్వులు కలిపి చిమ్మిలి చేసి, పంచిపెడతారు. సంవత్సరం పొడువునా స్నేహితులై ఉండాలని ఆకాంక్షిస్తూ, శుభ, సుఖ ప్రదం కావాలని దీవనలను పెద్దవారి నుండి పొందడం సదాచారం. ఇక చివరిది కనుము పండగ. అధర్వణ వేదంలో దీనిని ‘‘వృషభోత్సవం‘‘ అని పేర్కొన్నారు. మకర సంక్రమణం వెళ్ళిన మరునాడు పశువులకు చేసే పండగ ఇది. కనుమునాడు గోపూజ చేయడం కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఆవులను, దూడలను, ఎడ్లను శుభ్రంగా కడిగి, కొమ్ములకు, ముఖానికి పసుపు రాచి, కుంకుమ పెడతారు. అలంకరణార్థం కుచ్చులు, కొత్త కట్టుతాళ్ళు పెడతారు. వీధుల వెంట ఊరేగిస్తారు. పశు శాలలను శుభ్రపరిచి మామిడాకులు కట్టి, పూవులతో అలంకరిస్తారు. సాయంకాలం పొంగిలి నైవేద్యాన్ని పశువుల శాల వద్ద పెడతారు. పవిత్రోదకం చల్లుతారు. పంటలు పండించే భగవంతుడికి, పొలాలను దునే్న ఎద్దులకి కృతజ్ఞత తెలిపే పర్వం సంక్రాంతి యనడంలో ఎలాంటి సందేహం లేదు.

- సంగనభట్ల రామకిష్టయ్య