Others

తెలుగు నేలపై శైవమతాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రక యుగమున శాతవాహన, చాళుక్య, రాష్టక్రూట, కాకతీయ, ఆనంతర కాలమున హైందవ సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమైన తెలుగు నేలలో వివిధ రాజన్యుల ఏలుబడులలో శైవమతం పరిఢవిల్లింది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికే శైవారాధన ఉంది. గాథా సప్తశతిలో గౌరీ, పశుపతి స్తోత్రముంది. 1వ శతాబ్దంలో శైవంలో అత్యంత ప్రాచీనమైన పాశుపత శైవాన్ని లకులీస శివాచార్యుడు స్థాపించారు. చేతికందుతున్న చరిత్ర ఆధారంగా శ్రీముకుడు కాణ్య రాజైన సుశర్మను వధించి, మగధను ఆక్రమించి, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, వివిధ చరిత్రకారుల అభిప్రాయాన్ని అనుసరించి, క్రీ.పూ.1వ శతాబ్దిగా స్పష్టమవుతున్నది. శ్రీముకుడు జైన మతాన్ని స్వీకరించి, అనేక ఆలయాలను నిర్మించాడు. శాతవాహన 17వ రాజైన హాలచక్రవర్తి, సింహళ రాకుమారి లీలావతిని సప్త గోదావరీ తీరస్థ భీమేశ్వరాలయం నేటి జగిత్యాల జిల్లాలోని వేంపెల్లి వెంకటరావుపేటలో వివాహ మాడినట్లు, నాటికే భీమేశ్వరాలయం ఉన్నట్లు నిరూపితమైంది. బౌద్ధమతంలోనూ నాగదేవత ఆరాధన ఉంది. స్థూపాలను పెనవేసుకున్న నాగసర్పాల చిత్రాలు, ప్రధానంగా ధూళికట్ట స్థూపంపై ఐదుతలల నాగ ముచిలింద శిల్పాన్ని చూడవచ్చు. ఇక్ష్వాకు (క్రీ.శ.253-277) రాజైన ఎహువల శాంతమూలుని సేనానియైన ఎలిశ్రీ ఏలేశ్వరం నిర్మించి, సర్వదేవాలయమనే శివాలయాన్ని నిర్మించాడు. ఈయన కాలంలో విజయపురిలో కార్తికేయ, పుష్పభద్రస్వామి, నోడిగిరీశ్వర, దేవీ ఆలయాలు నిర్మితాలైనాయి. ఇక్ష్వాకుల కాలంలో మాతృదేవతారాధన కూడా ఉండేది. నాగార్జున కొండలో హరీతి ఆలయం నిర్మించ బడింది. హారీతి ఆలయంలో సప్తమాతృకల వద్ద గాజులను సమర్పించే వారని శాసనాధారం. వీరికాలంలో స్కంద గణపతి, యక్షుడు, హరీతి దేవతలను పూజించేవారు. అనంతర వాకాట రాజులలో అధికులు శైవులు. మొదటి రుద్ర సేనుడు మహా భైరవుని భక్తుడు కాగా, పొదటి పృధ్వీసేనుడు మహేశ్వర భక్తుడు. క్రీ.శ.358నుండి 569వరకు 210ఏళ్ళు తెలంగాణను, ఉత్తరాంధ్రను పాలించిన విష్ణుకుండినులు నేటి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆమ్రాబాద్ (అమలపురం), నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలంలోని ఇంద్రపాల నగరం. కొంతకాలం బెజవాడను రాజధానిని చేసుకున్నారు. వీరు బ్రాహ్మణ మతావలంబులు, శివభక్తులు. రెండవ మాధవవర్మ (క్రీ.శ.440-495) 100కుపైగా యుద్ధాలు చేసి, విజయాలు సాధించి, ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసర గుట్టపైన ఒక లింగ ప్రతిష్ఠ చేశాడు. విజయం సాధించిన చోటల్లా రామలింగేశ్వర ఆలయం కట్టించాడు.

- ఇంకావుంది...

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494