Others

కశ్మీర్ చరిత్రలో నమ్మలేని నిజాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లిమెడలో గంట ఎవరు కట్టాలి..? అంటూ దశాబ్దాల తరబడి నా న్చుతూ వస్తున్న ఓ మొండి సమస్యకి ముగింపు పలుకుతూ ప్రధాని మోదీ చివరికి- ఆ గంట కట్టారు. అయితే ఇది ముగింపా? లేక మరో సమస్య పురుడు పోసుకోవడానికి ప్రారంభమా? అనేది కాలమే చెప్పాలి.
నా చిన్నప్పుడు కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అనేవారు. పెరిగి పెద్దయ్యే సరికి అది.. భూతాల స్వర్గం అవుతుందని ఆరోజుల్లో ఎవరూ అనుకోలేదు. కాశ్మీర్ అంటే మంచు ముంచెత్తే లోయలు.. అందమైన సరస్సులు.. కనువిందు చేసే ప్రకృతి.. జీవితంలో ఏదో ఒక రోజు చూసితీరాలని అనిపించే ఇహలోక స్వర్గం. తీరని ఆ కోరిక తీర్చుకోవడం కోసమేమో తెలియదు, కాశ్మీర్ అందచందాలను ఆరబోసే హిందీ చలన చిత్రాలను, ఆ భాష అర్థం కానివాళ్లు కూడా విరగబడి చూసేవాళ్లు. ఒకప్పుడు కాశ్మీర్ అన్నా, దానే్న ఇప్పుడు కష్మీర్ అంటున్నా అది నిజంగా భూతల స్వర్గమే.
‘్భరత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, కాశ్మీర్ ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లాతో భేటీ’ అనే వార్త చిన్నప్పుడు పత్రికల్లో చదివినప్పుడు, ‘ఇదేమిటి కాశ్మీర్ భారత్ లో లేదా, దానికి వేరే ప్రధానమంత్రి ఏమిటి?’ అనే సందేహాలు పొటమరించేవి. కాశ్మీర్ చరిత్రే కాదు, ఏ ప్రాంత చరిత్ర అయినా ఆయా కాలాల్లో నివసించిన లేదా వాటిని గురించి అధ్యయనం చేసిన చరిత్రకారులు రాసిన పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి వీలుం టుంది. అంతమాత్రాన అది నూటికి నూరుపాళళు వాస్తవమైన చరిత్ర అని అనుకోలేము. రాసేవారి మనోభావాలుబట్టి, వారి వారి భావజాలాన్నిబట్టి కొంత వక్రీకరణ చోటుచేసుకునే వీలుంటుంది. అవి చదివేవాళళు కూడా వారి వారి అభిప్రాయాలకు తగ్గట్టుగానే చరిత్ర గురించిన అభిప్రాయాలను ఏర్పరచుకుని అవకాశం ఉంటుంది. ఇవే భావితరాల వారు నిజమైన చరిత్ర అని అపోహపడే ప్రమాదం ఉంది. ఇంతకూ మించి మనం చరిత్రను అవగతం చేసుకునే వీలు ప్రస్తుతానికి లేదు. ఈ విషయం గమనంలో ఉంచుకుని చరిత్రను అర్థంచేసుకునే ప్రయత్నం చేస్తే అపార్థాలకు తావుండదు.
స్వతంత్ర భారత చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరికీ అత్యంత విలువైన స్థానం ఉంది. స్వతంత్ర భారత రూపకల్పనలో ఎవరూ కాదనలేని స్థానం వారిద్దరిదీ. ఒకే రాజకీయ పార్టీకి చెందినా వారయినా వారి ఆలోచనా రీతులు విభిన్నం. చరిత్రను అర్థం చేసుకోకుండా, వ్యక్తి ఆరాధన కారణంతో విశే్లషించుకుంటే మిగిలేది చరిత్ర కాదు, కేవలం ఊహాగానభరితమైన కథాకథనం మాత్రమే. విచిత్రం ఏమిటంటే నెహ్రూను అభిమానించేవారు వారు పటేల్ పట్ల కూడా
అదే విధమైన ఆరాధనభావంతో ఉంటారు. అలాగే పటేల్ అభిమానులు కూడా నెహ్రూను ప్రేమిస్తారు. అయితే రాజకీయాల కోణం నుంచి చూస్తే వారికీ వీరికీ చుక్కెదురు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించేవారు పటేల్‌ను కారణం లేకుండానే అభిమానిస్తారు. ఒక రకంగా సినీ నటుల అభిమానులు ప్రదర్శించే గుడ్డి అభిమానం అనుకోవచ్చేమో! ఈ ఇద్దరు నాయకుల గురించి అనేక గ్రంథాలు వెలువడ్డాయి. కొన్ని వారి సమకాలీనులు రాసినవి. మరికొన్ని వారి తదనంతర కాలంలో అధ్యయనం చేసి రాసినవి. వారిపట్ల రచయితలకు ఉన్న సహజసిద్ధమైన అభిమానపు ఛాయలు వాటిల్లో తొంగిచూడడంలో ఆశ్చర్యం లేదు.
పాకిస్తాన్ కనుక హైదరాబాద్ డెక్కన్ (నాటి నిజాం సంస్థానం) పేరెత్తకుండా ఉంటే, కాశ్మీర్‌ను పాక్‌కు వదిలేసేందుకు పటేల్ సుముఖత వ్యక్తం చేసారని కాశ్మీర్ నేత సైఫుద్దీన్ సోజ్, ‘కాశ్మీర్, గ్లింప్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ది స్టొరీ ఆఫ్ స్ట్రగుల్’ అనే పుస్తకంలో రాసారు. ఆ ప్రకారం పటేల్ చేసిన ప్రతిపాదనను పాకీస్తాన్ లో కాశ్మీర్ వ్యవహారాలు కనిపెట్టి చూసే హయత్ ఖాన్ కు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వౌంట్ బాటెన్ అందించారు. పాకీస్తాన్ హైదరాబాద్ డెక్కన్ పేరెత్తకుండా ఉంటే కాశ్మీ ర్‌ను పాక్‌కు ఇచ్చేందుకు సిద్ధమేనని పటేల్ షరతు పెట్టారన్నది ఆ ప్రతిపాదన. హయత్ ఖాన్ దాన్ని అప్పటి పాక్ ప్రధాని లియాకత్ ఆలీఖాన్‌కు చేరవేశారు. ‘కాశ్మీర్ కోసం, అక్కడి బండరాళ్ళ కోసం పంజాబ్ కంటే విశాలమైన హైదరాబాద్ డెక్కన్ వదులుకునేందుకు నేనేమీ పిచ్చివాడిని కాదు’ అన్నది లియాఖత్ స్పందన.
కాశ్మీర్‌ను వదులుకునేందుకు తొలిరోజుల్లో పటేల్ సుముఖంగానే ఉండేవారని ఆయన దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వీపీ మీనన్ చెప్పారు. భారత దేశం, పాకీస్తాన్ ఈ రెంటిలో దేనిలో చేరతారో తేల్చు కోండని వల్లభాయ్ పటేల్, 1947 జూన్ 3న ఆనాటి స్వదేశీ సంస్థానా ధీసులకు రాసిన లేఖలో ఓ అవకాశం ఇచ్చారని ‘ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ అనే పేరుతో రాసిన ఓ పుస్తకంలో మీనన్ పేర్కొన్నారు. రాజ్ మోహన్ గాంధీ ‘పటేల్ ఏ లైఫ్’ అనే పేరుతో రాసిన పుస్తకంలో కొన్ని విషయాలు....
‘‘1947 అక్టోబర్ 26 న నెహ్రూ నివాసంలో ఒక సమావేశం జరిగింది. మహరాజాహరిసింగ్ దూతగా వచ్చిన మెహర్ చాంద్ మహాజన్ కాశ్మీర్ రాజు తరపున భారత్‌సైనిక సాయాన్ని అర్థించారు. ఇందుకు భారత్ అంగీకరించని పక్షంలో పాకీస్తాన్ సాయం కోరాల్సివస్తుందని కూడా మెహర్ చాంద్ చెప్పారు. ఆ మాట నెహ్రూకు విపరీతమైన కోపం తెప్పించింది. ‘అలా అయితే తక్షణం వెళ్ళిపొమ్మని ఆ దూతని ఆదేశించారు. సర్దార్ పటేల్ ఆ సమయలో కలగచేసుకుని ‘మహాజన్! మీరు పాకిస్తాన్ తో కలవడం లేదు’ అని హామీ ఇచ్చారు. (అంటే భారత్ మీరు అడిగిన సాయం చేయడానికి సిద్ధంగా ఉంది అనే అర్థం అందులో వుందని రాజ్ మోహన్ గాంధీ అభిప్రాయం)
కాశ్మీర్ పట్ల పటేల్‌కు పెద్ద ఆసక్తి లేదని తెలిపే మరో ఉదంతాన్ని గుజరాతీ చరిత్రకారుడు, రచయిత అయిన ఊర్విష్ కొఠారి బీబీసీ ప్రతినిధికి వెల్లడించారు. ‘సచో మానస్ సాచి వాట్’ అనే పేరుతొ గుజరాతీలో ఊర్విష్ కొఠారి ఒక పుస్తకం రాసారు. అందులో పేర్కొన్న కొన్ని విషయాలను ఆ రచయిత బీబీసీతో ఇలా పంచుకున్నారు...
‘‘కాశ్మీర్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. భౌగోళికంగా చూసినా ఆ ప్రాంతం పాకిస్తాన్ కు దాపులో ఉంది. అంచేత భారత్ లో కాశ్మీర్ విలీనం పట్ల పటేల్ కు పెద్దగా ఆసక్తి లేదు. స్వయానా కాశ్మీరీ అయిన నెహ్రూకు మాత్రం కాశ్మీర్‌ను భారత్‌లో కలపాలనే కోరిక బలంగా వుండేది. పైగామహారాజా హరి సింగ్ , షేక్ అబ్దుల్లా ఇద్దరూ నెహ్రూకు మంచి స్నేహితులు. కాశ్మీర్ విషయంలో అవసరానికి మించి నెహ్రూ సున్నితంగా, ఉదారంగా వ్యవహరించడానికి అదో కారణం అంటారు ఊర్విష్. ఈ పుస్తకాల్లో రాసినవన్నీ అక్షర సత్యాలని భావించలేము. ఆ రోజుల్లో అంటే నెహ్రూ శకంలో వల్లభాయ్ పటేల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరిగాయన్నది కొందరి వాదన. భారత్‌లో కాశ్మీర్ విలీనం జరిగి ఏండ్లూ పూండ్లూ గడిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, పత్రాలు భారత పార్లమెంటు గ్రంథాలయంలో దొరికే అవకాశం ఉ ంది. అయితే ఈనాటి వేగయుగంలో అంతటి ఓపికా తీరికా ఉన్నవారు తక్కువ. కాబట్టి నమ్మినా నమ్మకపోయినా- కొన్ని పుస్తకాల్లో రాసిన విషయాలనే ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది.

-భండారు శ్రీనివాసరావు 98491 30595 http://bhandarusrinivasarao.blogspot.com