Others

కోరికలు తీర్చే కొల్హాపూర్ మాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణ మాసం రాగానే అంగనలందరూ లక్ష్మీదేవి వర లక్ష్మిదేవీగా భావించి కొలుస్తుం డడం అనాదిగా వస్తోంది. ఐశ్వర్యప్రదాతయైన శక్తినే మహాలక్ష్మిగా సంభా వించడం గౌరవించడం, పూజించడం సనాతన ఆచారమే. ఈ తల్లి విష్ణుదేవుని ఇల్లాలుగాను, సముద్రుని తనయ గాను, భృగు మహర్షి కుమార్తెగా కొనియాడబడుతుంది. ఓం, శ్రీం హ్రీం ఐం అనే బీజాక్షరములతో తల్లిని ధ్యానించాలని మంత్ర శాస్త్రం చెబుతుంది. పదునెనిమిది చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం కమలము, ధనస్సు, కలశము, దండం, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము ఘంట, మద్య పాత్రము, శూలం, పాశం, సుదఠ్శన చ్రకము, ధరించి ప్రవాళ మణి వర్ణంతో తామరపూవుపై చిరునవ్వు తూ పలకరించే స్ర్తి మూర్తియే మహాలక్ష్మిగా పురాణాలు చెబుతున్నాయ.
అయతే ఈ తల్లి ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కలశం, మరో చేతిలో పుష్పం, ఇంకో చేతిలో పానపాత్రలను పట్టుకుని చతుర్భు జాలతో దర్శనమివ్వడానికి కొల్హాపూర్‌కి విచ్చే సింది. ఇక్కడ ఈ మహాలక్ష్మి అమ్మవారు కిరీటి ధారిణి, అమ్మవారికి గొడుగు పడ్తున్నట్టుగా ఆదిశేషుడు కొలువుతీరాడు.
అష్టదళపద్మంలో ఆసీనురాలై చిన్మయ రూపిణిగా దర్శనమిచ్చే ఈ తల్లి ఒకసారి వైకుంఠాన్ని వదిలి భూలోకం విచ్చేసిభూలోక అందాలను చూస్తూ పరవశించి మహారాష్టల్రోని కొల్హాపురిలో కొలువె ఇక్కడి భక్తులను కాపాడుదామని నిర్ణయంచుకుంది. అందుకే ఆతల్లి ఇక్కడ కొలువైంది. కొల్హాపూర్ నే పూర్వం కరవీరం పురం అని పిలిచేవారు. అందుకని ఈ తల్లిని కూడా కరవీర్ మాత జయహో అంటూ అమ్మను స్వాగతించారు ఇక్కడి జనం.
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పేర్గాంచిన ‘కొల్హాపూర్’ లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి మహత్తు గొప్పది. ప్రకృతి అందాల నడుమ అలరారే ‘కరవీర్ నగరం’ అతి ప్రాచీనమైనది. అతి పురాతనమైన ఈ నగరం ‘108’ కల్పాలకు పూర్వం నాటిదంటారు. ‘కరవీర్ నగరం’ గురించి కాశీఖండం, పద్మపురాణం, దేవీ భాగవతం, స్కంద, మార్కండేయ పురాణాలు ప్రసావిస్తున్నాయ.
పురాణ గాథ:-
ఒకానొక సమయంలో కాశీని విడిచి వచ్చిన అగస్త్యుడు లోపాముద్రా దేవి పరమశివుడ్ని కాశీవిశే్వశ్వరి అంతటి మహిమాన్వితమైన తల్లి ఉన్న ఆలయాన్ని చూపించమని కోరారట. దానికి ఆ పరమశివుడు కొల్హాపూర్‌లో కొలువైన మహాలక్ష్మిని మీరు చూస్తే కాశీవిశే్వశ్వరిని చూచిన అనుభూతి కలుగుతుందని, ఆ తల్లి చల్లని చూపు మీకోరికలే కాక సకల జనుల కోరికలు ఈడేరేటట్లు మీరు చేయగలరని అందుకే మీరిద్దరూ కొల్హాపురి మహాలక్ష్మిని కొలవమని చెప్పాడట. పరమశివుని మాటే వేదవాక్కులా తలిచిన లోపాముద్రాఅగస్త్యులు వెంటనే కొల్హాపురికి వెళ్లి ఆ తల్లిని తమశక్తిమేరాస్తుతించారని పురాణాలుచెబుతాయి.
ఇక్కడ అమ్మవారి ఆలయానికి సమీపంలో ఒకపక్క శారదామాత, మరోపక్క కాళికామాత మందిరాలున్నాయి.
శ్రీచక్రానికి దగ్గరగా సూర్యదేవుడు, విఘ్నేశ్వరుడు, శ్రీకృష్ణ భగవానునుని చిన్ని మందిరాలున్నాయి. ప్రధానాలయ ప్రాకారంపై ‘సటువాభాయి’ శిలా ప్రతిమ ఉంది. ఈ తల్లి మహిమ గొప్పదని మహారాష్ట్ర ప్రజల నమ్మకం. ఆ కారణంగానే తమ శిశువులను ‘సటువాభాయి’ మూర్తికి కింద భాగంలో ఉంచి, పూజలు నిర్వహిస్తారు. అలా చేయడం వల్ల తమ పిల్లల భవిష్యత్‌ను లోక మాత సటువాభాయి తీర్చిదిద్దుతుందని నమ్ముతారు. ఆలయానికి ముందు భాగంలో నిత్య అగ్నిహోత్రి గుండం ఉంది. ఇది నిరంతరాయంగా మండుతూనే ఉంటుంది. ఆలయంలోకి వచ్చిన భక్తులు తమతో తెచ్చిన సుగంధ ద్రవ్యాలను ఈ గుండంలో వేసి, ఆలయంలోకి ప్రవేశించడం ఇక్కడి సంప్రదాయం. ఆలయంలో మరోపక్క ఉమా మహేశ్వరస్వామి, శనీశ్వరుడు, దత్తాత్రేయుడు, గరుడ మండపం, దీప్తస్తంభం, వీరభద్రస్వామి, నాగేంద్రుడు, భైరవమూర్తులున్నాయి.
ఆ మహాలక్ష్మే అన్నింటికీ కారకురాలు కనుక ఆ శక్తే మహాలక్ష్మీగా కరవీర లక్ష్మిగా ఆవిర్భవించిందని భావించేవారు అమ్మను మంగళప్రదయైన సౌభాగ్య లక్ష్మిగా, ధైర్య, స్థైర్య, స్థిరబుద్ధులను మానవాళికి ప్రసాదిస్తుందంటారు. ఈ తల్లే ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్ములుగా అష్టమూర్తులలో విరాజిల్లుతోంది. అందుకే లక్ష్మి దేవి సంపదకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, తుష్టికి, పుష్టికి, యశస్సులకు మూలకారణం.
కరవీరపురం:-
పంచగంగా నది ఒడ్డున అలరారుతున్న ఈ ప్రాచీన నగరాన్ని కొంకణరాజు కర్ణదేవ, వౌర్యుడు, చాళుక్యుడు, రాష్టక్రూటులు, ఇతర యాదవ రాజులు పాలించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయ. ఈ నగరాన్ని కొలతాపూర్, కళ్ళ, కోల్‌గిరి, కొలదగిరి పట్టణం అనే పేర్లతో ఇంత కు పూర్వం పిలిచేవాళ్లట. ‘కొళ్ళ’ అంటే వ్యాలీ (లోయ) అని అర్థం. ‘పూర్’ అంటే పట్టణమని అర్థం. అంటే ఈ పట్టణ ప్రాశస్త్యాన్ని బట్టి కర్‌వీర్ నగరమే రానురాను కొల్హపూర్‌గా మారిఉంటుందని ఇక్కడివారు అంటారు. కొల్హాపూర్‌లో ఉన్న శ్రీమహాలక్ష్మి ఆలయ చరిత్ర ఎన్నో వేల సంవత్సరాల పూర్వంది. ఎందుకంటే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించిందీ తెలియడానికి ఇతమిత్థమైన ఆధారాలు ఇప్పటికీ లభించడం లేదు. అయితే ఈ ఆలయం క్రీ.పూ. 4, 5 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించి ఉండవచ్చని ఇక్కడి శాసనాలు చెప్తున్నాయ. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ, 18వ శతాబ్దంలో శంభాజీ మహారాజులు, ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు తెలుస్తోంది. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు దర్శించారట. ఆయన ఇక్కడ అమ్మవారి లీలా విశేషాలను స్వయంగా వీక్షించి, ఇక్కడ మఠం ఏర్పాటుచేశారు. ప్రధానాలయంలో ఉన్న ‘శ్రీచక్రం’ ఆదిశంకరాచార్యుల వారిచే ప్రతిష్టింబడిందంటారు.
నిత్యపూజలు:-
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి తెల్లవారుజామున 4:30 గంటలకు హారతినిస్తారు. దీనిని ‘కాకడ హారతి’ అంటారు. ఈ సమయంలో భూపాల రాగాన్ని ఆలపిస్తారు. ఉదయం 8:30 గంటలకు మంగళహారతి, ఉదయం 11:30 గంటలకు కుంకుమ, పుష్పాలతో అమ్మవారికి అర్చన, అనంతరం మధ్యాహ్నం రెండు గంటల వరకూ పంచామృతాలతో అభిషేకం, అర్చనలు నిర్వహిస్తారు. రాత్రి 7:30 గంటలకు ఇచ్చే హారతిని ‘బోగ్-హారతి’ అని వ్యవహరిస్తారు. ప్రతి శుక్రవారం రాత్రిపూట అమ్మవారికి నైవేద్యం పెడతారు. రాత్రి 10 గంటలకు శేష హారతినిచ్చి అమ్మవారికి పవళింపచేస్తారు.
దేవాలయానికి మార్గం:-
ఈ ఆలయం కొల్హాపూర్ పట్టణ నడిబొడ్డున ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్ళు ఈ పట్టణానికి అందుబాటులో వున్నాయి. కొల్హాపూర్ పట్టణానికి ముంబాయి, బెంగుళూరు, పుణెల నుంచి నేరుగా రైలు సౌకర్యం ఉంది. హైద్రాబాద్ నుంచి ప్రయివేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైద్రాబాద్ నుంచి ఈ పట్టణం చేరుకోవడానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు