Others

మానవ హక్కుల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించబడినవి. ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన పెంచటానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 1948 సంవత్సరంలో మానవ హక్కుల సార్వత్రిక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన రోజుకు గుర్తుగా ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని’ అన్ని దేశాలను, సంస్థలను ఆహ్వానించి జనరల్ అసెంబ్లీ 423(ఐ) తీర్మానం ఆమోదించింది. అప్పటినుండి అన్ని దేశాలూ డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం పాటించడం ఆనవాయితీగా మారింది. 1993లో మానవ హక్కుల అభివృద్ధి, పరిరక్షణ కోసం ఒక హైకమిషనర్‌ను ఐరాస నియమించింది.
మానవ హక్కులు అనేవి మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంబంధించినవి. మానవ హక్కులు అనేవి సార్వత్రిక, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970లో ముఖ్యంగా పూర్వ మరియు పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో ప్రధానంగా ఐక్యరాజ్యసమితి, లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి.
మన దేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లో ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రధాని పి.వి.నరసింహారావు 1993 అక్టోబర్ 12న మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కాని రాజ్యాంగబద్ధమైన సంస్థకాదు. ఆ తర్వాత మానవ హక్కుల చట్టాన్ని 2006 సంవత్సరంలో సవరించి కొన్ని మార్పులు చేశారు. దీని కార్యాలయం ఢిల్లీలో ఉంది. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడుతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది.
మానవ హక్కుల పరిరక్షణ చట్టం- మానవ హక్కులను రాజ్యాంగం, అంతర్జాతీయ ఒడంబడికలు హామీ ఇస్తున్న వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, పరువుమర్యాదలకు సంబంధించిన హక్కులుగా పరిగణించినది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. కాని అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కూడా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించివేస్తోంది. పరువుహత్య, జాతి వివక్ష హత్య, అత్యాచార ఘటనలు.. ఇలా అనేకరకాల వార్తలు మనం అనునిత్యం వింటూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాఢ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘసంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పిచేందుకు 1948 డిసెంబర్‌న ఐక్యరాజ్యసమితి ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ చేసింది. ఈ ప్రకటన ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలి. కాని జాతి, మత, రాజకీయ, వ్యక్తిగత కారణాల ఫలితంగా ప్రజలు ఇబ్బందులకు గురి కారాదు. ఈమధ్యకాలంలో ప్రేమ పేరుతో జరిగిన పరువుహత్యలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చును.
అగ్రరాజ్యం అమెరికాలో సైతం జాతి వివక్ష కారణంగా అక్కడివారు మిగతా దేశాల వారి ప్రాణాలు బలిగొంటున్నారు. ఇలా అనేక సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మైకు దొరికితే ప్రసంగాలతో అదరగొట్టే పాలకులు వారి పదవులను కాపాడుకోవడానికి చూపే శ్రద్ధ ప్రజల ప్రాణాలపై చూపడం లేదు.
ప్రధాన లక్ష్యాలు...
- జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి.
- చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడడం.
- వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం.
- నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి.
- స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి.
- సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు ఉండాలి.
- బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి.
- విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి.
- భావప్రకటన, స్వాతంత్య్రపు హక్కు ఉండాలి.
- ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి.
ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినపుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించవచ్చు.
మానవ హక్కుల కమిషన్‌లు ఉన్నాయని పౌరులు ప్రతి విషయానికి ఇతరులను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టడానికి కమిషన్‌లను ఆశ్రయించకూడదు.
భారత రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడుతాయి. ఉదాహరణకు ఈమధ్య కాలంలో భారత్‌లో కశ్మీర్ అంశం విషయంలో 370 రద్దు జరిగిన సమయంలో కాని, అయోధ్య తీర్పు విషయంలో గాని ప్రభుత్వం అక్కడి పౌరులకు కొన్ని ఆంక్షలు విభించినపుడు జరిగిన పరిణామాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురైన సందర్భంలో మానవ హక్కుల కమిషన్‌లు జోక్యం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంవలన క్రమేపి కొన్ని ఆంక్షలను సడలించారు. ఇలా ప్రజలకు ఇబ్బందులు కల్గినపుడు మానవ హక్కుల కమిషన్‌లు కాని ప్రత్యేక కోర్టులు పరిష్కార మార్గాలను చూపుతున్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ సోదరభావంతో మెలగాలి. దేశ ప్రజలంతా ఐకమత్యంతో ఉన్నపుడే ఎలాంటి విపరిణామాలు చోటుచేసుకోవు.
*
(నేడు ‘ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం’)

-సామంతుల సదానందం, పరకాల