Others

పిల్లలపై పెరుగుతున్న నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల చైల్డ్ రైట్స్ అండ్ యూ ప్రచురించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ద్వారా పిల్లపై నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, భారతదేశంలో మొత్తం నేరాల పెరుగుదల 5 శాతంపైగానే ఉందని వెల్లడైంది. వీటిలో కిడ్నాప్, అపహరణ కేసులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. పిల్లలపై నేరాలు 20 శాతం పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం నేరాల సంఖ్యకంటే 3.6 శాతం పెరిగిందని చైల్డ్ రైట్స్ అండ్ యూ (సిఆర్‌వై) విశే్లషణ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ కేసులతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 19వేల కేసులతో రెండూ 14.8 శాతంగా వున్నాయి. జార్ఖండ్‌లో పిల్లలపై నేరాలు అత్యధికంగా 73.9 శాతంగా ఉండగా, 2016 నుంచి 2017 మధ్య మణిపూర్‌లో 18.7 శాతం గణనీయంగా క్షీణించింది. పిల్లలపై జరిగే నేరాలలో, కిడ్నాప్ మరియు అపహరణలు మొత్తం 1,29,032 నేరాలలో 42 శాతం నమోదయ్యాయి. పిల్లలపై జరిగే ఇతర ప్రధాన నేరాలలో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, అత్యాచారం, లైంగిక వేధింపులు మరియు మైనర్ బాలికలను సేకరించడం వంటివి ఉన్నాయి. పిల్లలపై జరిగే ఇతర నేరాల్లో హింసించడం, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, అత్యాచారాలు, మైనర్ బాలికలను సేకరించం లాంటివి ప్రధానంగా జరుగుతున్నాయి. పిల్లలపై రోజుకు 350 రకాల నేరాలకు పాల్పడుతున్నారని ఈ నివేదిక ద్వారా వెల్లడి అయింది. మైనర్ బాలికల అపహరణ 37 శాతం పెరిగిందని బాలల హక్కుల సంఘం తెలిపింది. జార్ఖండ్ మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో కొత్తగా ప్రవేశించింది. కిడ్నాప్, అపహరణ కేసుల్లో బీహార్ కూడా మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో చేరింది. బాల కార్మికుల సంఖ్య కూడా 136 శాతం పెరిగింది. ఎన్‌సిఆర్‌బి నివేదిక 2017లో 462 బాల కార్మికుల కేసులను 2016లో 204కు వ్యతిరేకంగా జాబితా చేసింది. బాల్య వివాహాల విషయానికొస్తే ఎన్‌సిఆర్‌బి 395 కేసులను బాల్య వివాహాల నిషేధ చట్టం (పిసిఎంఎ) 2006 కింద నమోదు చేసింది. రిపోర్టింగ్‌లో 21.17 శాతం పెరుగుదల వున్నట్లు ఇది చూపిస్తుంది. నిర్భయ చట్టం, దిశ చట్టం లాంటివి నేడు ఎన్ని మహిళా, శిశు రక్షణ తీసుకువచ్చినా మృగాళ్ల ఆలోచనల్లో మార్పు రావడంలేదు. కొన్నిచోట్ల మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలాచోట్ల పిల్లలను కొట్టడం, వారితో దురుసుగా ప్రవర్తించడం లాంటి ఘటనలను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. పిల్లలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వారి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వారి హక్కులను కాపాడడానికి అందరూ కృషిచేయాలని చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు.
బాలల హక్కులు, బాలల పరిరక్షణ అంశాలు గురించి నేడు పిల్లలతో ప్రమేయం కలిగి ఉండే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పిల్లల రక్షణ చర్యలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలి. ఇల్లు తరువాత పాఠశాలలే బాలలకు సురక్షితమైనవి మరియు పిల్లలకు సంతోషాన్ని అందించేవి. కాబట్టి పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో శిశు సంరక్షణా చర్యలు చేపట్టేలా ప్రభుత్వం చూడాలి. రాజ్యాంగంలోని అధికరణ 21 గౌరవంతో జీవించేహక్కును తెలుపుతుంది. అలాగే పధ్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ విద్యా హక్కును కూడా ఈ అధికరణమే వివరిస్తుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం పిల్లలను శారీరకంగా శిక్షించడం ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టడం వంటివి వారిపై దాడిగానే పరిగణిస్తారు. ఇది పిల్లల స్వేచ్ఛ, గౌరవాలకు భంగకరం. శారీరక శిక్షలకు భయపడి పిల్లలు బడికి వెళ్లటానికి నిరాకరిస్తారు లేదా శాశ్వతంగా బడికి వెళ్లటం మానేస్తారు. ఈ విధంగా శారీరక శిక్షలు పిల్లల విద్యా హక్కుకు భంగం కలిగిస్తాయి. విద్యా హక్కు చట్టం (ఆర్‌టిఈ), 2009లోని సెక్షన్ 17, శారీరక దండనపై సంపూర్ణ నిషేధం విధిస్తుంది. ఇది పిల్లలకి శారీరక శిక్ష మరియు మానసిక వేధింపులను నిషేధిస్తుంది. మరియు అలాంటివాటికి పాల్పడే వ్యక్తికి వర్తించే ఏ నిబంధనల ప్రకారం దోషిగా వున్న వ్యక్తిపై తీసుకోవలసిన క్రమశిక్షణా చర్యలను సూచిస్తుంది. పిల్లల సంరక్షణ మరియు రక్షణను అప్పగించిన ఒక సంస్థ చేత నియమించబడిన లేదా నిర్వహించే ఏ వ్యక్తి అయినా శారీరక లేదా మానసిక బాధలను కలిగించే రీతిలో పిల్లలపై దాడి, దుర్వినియోగం, బహిర్గతం లేదా నిర్లక్ష్యం చేయబడినప్పుడు, శిక్ష ఐదు సంవత్సరాల వరకు కఠినమైన జైలుశిక్ష ఉంటుంది. మరియు ఐదు లక్షల వరకు జరిమానా. అంతేగాక పైన పేర్కొన్న క్రూరత్వం కారణంగా, పిల్లవాడు శారీరకంగా అసమర్థుడైతే లేదా మానసిక అనారోగ్యానికి గురైతే లేదా క్రమంగా పనులు చేయడానికి మానసికంగా అనర్హుడైతే లేదా ప్రాణానికి లేదా అవయవానికి ప్రమాదం కలిగివుంటే, అపుడు జైలుశిక్ష పదేళ్లవరకు ఉండవచ్చు. హక్కులు, సంరక్షణ, సంస్థాపరమైన బాధ్యతలు. యునైటెడ్ నేషన్స్ కనె్వన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ నిబంధన 19 ప్రకారం ఈ ఒప్పందంలోని భాగస్వామ్య దేశాలన్నీ పిల్లల తల్లిదండ్రులు, చట్టబద్ధ సంరక్షకులు లేదా బాగోగులు చూసుకునే మరెవరి సంరక్షణలోనైనా ఉన్నపుడు లైంగిక వేధింపులు, శారీరక లేదా మానసిక హింస, గాయం లేదా వేధింపు, నిర్లక్ష్యం, నిర్లక్ష్యవైఖరి, తిండి పెట్టకపోవడం లేదా దోపిడీలకు గురికాకుండా చట్టపరమైన, పాలనాపరమైన, సామాజికపరమైన, విద్యాపరమైన చర్యలను తీసుకోవాలి. అన్ని రకాల వేధింపులు, నిర్లక్ష్యాల నుంచి రక్షణ పొందే హక్కు బాలలకు ఉందని యునైటెడ్ నేషన్స్ కన్వన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ స్పష్టం చేస్తోంది. బాలల విద్యార్థి దశలో వారందరికీ రక్షణ కలిగించడమనేది విద్యార్థి దశలో క్లిష్టమైనది. బాలలు 12 సంవత్సరాలపాటు పాఠశాలలో గడుపుతారు కాబట్టి పాఠశాల యాజమాన్యం, పిల్లల కుటుంబాలు వారి సంరక్షణకై ప్రధాన పాత్రను నిర్వహించాలి. తద్వారా పిల్లలను రక్షించి, వారిపై పెరుగుతున్న హింస, నేరాలను అరికట్టేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమాజం, ప్రభుత్వం కృషి చేయాలి.

- వాసిలి సురేష్ 9494615360