హైదరాబాద్

ప్రజావాణిలో సమస్యలు స్వీకరించిన డిప్యూటీ మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రజాసమస్యల పరిష్కారం..అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కోసం మహానగర పాలక సంస్థ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈసారి డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దిన్ నిర్వహించారు. సోమవారం ఉదయం ఆయన ఫేస్ టు ఫేస్ హాల్‌లో నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి ఫిర్యాదులను, ఆర్జీలను స్వీకరించారు. అంతేగాక, సమస్యలను పరిష్కరించే తీరును అధికారులను అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా స్వీకరించిన సమస్యలను తప్పకుండా నిర్ణీత సమయంలోనే పరిష్కరించి ఆర్జీదారుడికి సమాచారమిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దిన్ మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, అధికారులు ప్రజలకు దగ్గరవ్వాలని, తద్వారానే ఆశించిన విధంగా అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి సమస్యపై వివిధ విభాగాలకు చెందిన అధికారులు క్షేత్ర స్థాయి తనిఖీలు, పర్యటనలు నిర్వహించి వాస్తవాలను గుర్తించిన తర్వాతే ప్రజలకు జవాబు ఇవ్వాలని సూచించారు.