ఆంధ్రప్రదేశ్‌

‘పరామర్శ యాత్రల పార్టీగా మారిన వైకాపా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ప్రతి విషయానికి పరామర్శలు చేస్తూ వైకాపా పరామర్శ యాత్రల పార్టీగా మారిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. వైకాపా నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గాను దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నారా లోకేశ్ ఎదుగుదలను చూసి ఓర్వలేక వైసిపి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి ఎయిర్‌పోర్టులో మిధున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు గుండాయిజం, రౌడీయిజం చేసి అధికారిపై చేయి చేసుకున్న పరిణామాలపై వైసిపి నేత అంబటి రాంబాబు నోటికి వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.