ఆంధ్రప్రదేశ్‌

పేదలకు అండగా నిలిచిన నేత పరిటాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: పేద ప్రజలకు అండగా నిలిచిన నేత స్వర్గీయ పరిటాల రవి అని పలువురు నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం పరిటాల 11వ వర్ధంతిని పార్టీ నేతలు జరుపుకొన్నారు. పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఫ్యాక్షన్, భూస్వామ్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు పరిటాల అని కొనియాడారు. రవి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, టిడిపి పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏవి రమణ, ఎపి స్కిల్ డెవలెప్‌మెంట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ, టిటిడిపి ఎస్‌సి సెల్ కన్వీనర్ బొట్ల శ్రీనివాస్, అజ్మీరానాయక్ తదితరులు, కార్యకర్తలు పరిటాల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.