ఆంధ్రప్రదేశ్‌

పట్టాలు తప్పిన హైలాండ్ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, ఫిబ్రవరి 5: బెంగళూరునుంచి కన్యాకుమారికి వెళ్లే హైల్యాండ్ ఎక్స్‌ప్రెస్ కుప్పంకు సుమారు 40కిలోమీటరు దూరంలో తమిళనాడులోని పచ్చూరు వద్ద శుక్రవారం వేకువ జామున పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో సుమారు 30మందికి గాయాలైయ్యాయి. బెంగళూరుకు వస్తున్న రైలు సోమనాయకన్‌పట్టి గ్రామ సమీపంలో పట్టాలు తప్పింది. రెండు రిజర్వేషన్ బోగిలు బోల్తాపడ్డాయి. రైలులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని వాణియంబాడి ఆసుపత్రికి తరలించారు. కాగా రైలు పట్టాలు తప్పిన విషయం తెలియగానే తమిళనాడు అధికారులు పెద్దఎత్తున ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. రైలులో ప్రయాణికులను ప్రత్యామ్నాయంగా రైల్వే అధికారులు గమ్యస్థానాలకు చేర్చారు. చెన్నై-బెంగళూరు రైలు మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాగా ప్రమాదానికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.