జాతీయ వార్తలు

పాక్‌ దుశ్చర్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : పాక్‌ దుశ్చర్యలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. బెంగుళూరులో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళి అర్పిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అమర జవాన్లకు నివాళి అర్పిస్తూ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయిక్‌ రూపొందించారు. ఉదంపూర్‌, అగర్తలా నగరాల్లోనూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అమర జవాన్లకు నివాళిగా కొవ్వొత్తుల మార్చ్‌ నిర్వహించారు.