తెలంగాణ

మా పాలనకు మెచ్చి జనం ఇచ్చిన తీర్పు ఇది: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుని పాలేరు నియోజకవర్గ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని తెరాస అధినేత, సిఎం కెసిఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఇంతవరకూ ఎవరికీ 25వేల మెజారిటీ రాలేదని, ఇపుడు తమ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 45వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించడం అరుదైన విషయమని ఆయన గురువారం మధ్యాహ్నం మీడియాతో అన్నారు. అవినీతి లేని పాలనను అందిస్తున్నందుకే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు తమ పార్టీకి పట్టం కడుతున్నారని కెసిఆర్ అన్నారు. రెండేళ్ల పాలనను ప్రజలు సమీక్షించిన ఇచ్చిన తీర్పు పాలేరు ఉపఎన్నికలో వెల్లడైందన్నారు. ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు.