తెలంగాణ

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆగస్టు నుంచి ప్లాస్టిక్‌ సంచులపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులపై ఆగస్టు 1 నుంచి నిషేధం విధించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ప్లాస్టిక్‌ సంచులపై నిషేధం అమల్లోకి వచ్చాక వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే వాణిజ్య లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న సంచులు అమ్మే దుకాణాలపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలందరూ జ్యూట్‌ సంచులు వాడాలని కమిషనర్‌ సూచించారు. ప్లాస్టిక్‌ కవర్ల ఉత్పత్తిదారులు, పంపిణీదారులతో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్లాస్టిక్‌ సంచుల నిషేధంపై చర్చించారు.