తెలంగాణ

పోలీసులపై దాడి: ఖైదీ పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగర శివారులోని ఉప్పర్‌పల్లి కోర్టులో ఇద్దరు రిమాండ్ ఖైదీలను హాజరుపరిచి తిరిగి తీసుకుని వెళ్తుండగా ఇద్దరు ఖైదీలు ఆకస్మింగా పోలీసులపై దాడి చేసి పలాయనం చిత్తగించారు. అయితే, పోలీసులు పరుగుపెట్టి ఓ ఖైదీని మాత్రం పట్టుకోగా మరో ఖైదీ మాత్రం పరారయ్యాడు. చోరీలు, అత్యాచారం కేసులో యుపికి చెందిన జీషన్ పాల్, అరవంద్ శర్మ అనే దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌లో ఉన్న వీరిని మంగళవారం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వీరిని తిరిగి తీసుకువెళ్తుండగా దొంగలిద్దరూ పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. జీషన్ పాల్‌ను వెంటాడి పట్టుకోగా, పరారైన అరవింద్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు.