పఠనీయం

బలమైన వారసత్వ, కుటుంబ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను - నా కుటుంబం
-మదమంచి సాంబశివరావు
పుస్తకాలు దొరుకు ప్రదేశం ఫ్లిప్‌కార్ట్‌లో నేను-నా కుటుంబం పేరుతో సర్చ్ చేస్తే
దొరుకుతుంది పుస్తకం ధర రూ.499 అయినా రూ.250 అందిస్తున్నారు.
-9885317835
దేశంతో పాటు మన రాష్ట్రంలో కూడా రాజకీయాలే అన్ని జిల్లాలను ఆక్రమించాయి. దేశంలో అత్యధిక శాతం పాలన జవహర్ లాల్ నెహ్రు వారసులు కొనసాగించినట్లు, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కొన్ని కుటుంబాలే రాజకీయ అధికారం చెలాయిస్తున్నాయి. అయితే వాటి మంచి చెడు జోలికి వెళ్లకుండా సీనియర్ జర్నలిస్ట్ మదమంచి సాంబశివరావు వారసత్వ, కుటుంబ రాజకీయాలపై పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు. వారసత్వం అనేది అన్ని సందర్భాల్లో మంచి ఫలితాలివ్వదు. వ్యాపారాలు, వృత్తులు వంటి వాటిలో సాధ్యమైనా రాజకీయాల్లో మాత్రం సాధ్యం కాదు. అంతర్జాతీయంగా కొన్ని వ్యాపార సంస్థలు, మన దేశంలో టాటా, బిర్లా, అంబానీ వంటివారు, గ్రామాల్లో, పట్టణాల్లో వైశ్య కులం వారు వారసత్వంగా వ్యాపారాలు కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారు. అలాగే చేతి వృత్తులు ముఖ్యంగా పౌరోహిత్యం, చేనేత, విశ్వబ్రాహ్మణులు, నారుూ బ్రాహ్మణులు వంటి వారి వృత్తులు వేల సంవత్సరాలుగా వారసత్వంగానే కొనసాగుతున్నాయి. ఆయా రంగాల్లో నైపుణ్యత కూడా అలవడుతోంది. రాజకీయాల్లో మాత్రం రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య రాజకీయాల వరకు ఒకటి రెండు తరాలకు మంచి ఫలితాలిచ్చిన దాఖలాలు లేవు. మన దేశంలో, రాష్ట్రంలో రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల కోసం పాకులాట ఎక్కువగానే ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తండ్రీ కొడుకులు, భార్య భర్తలు, తల్లీ- కొడులు, తల్లీ- కూతుళ్లు, తండ్రీ, కోడుకు, మనవడు వంటి వారసత్వంతో పాటు అన్నదమ్ములు, వియ్యంకులు, బావబావమరుదులు వంటి ఇతర కుటుంబ సభ్యుల రాజకీయ వారసత్వ పోకడల గురించి ఇందులో చాలా విషయాలు రాశారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల నష్టాలు ఎన్నో జరిగాయి. అరాచకీయానికి దారితీశాయి. ఆయా నాయకుల ఆర్థిక స్థోమత, వ్యక్తిత్వాలు మీద ఆధారపడి వారు రాణించిన, ప్రజలకు మేలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అటువంటివి చాలా తక్కువ. అటువంటి నాయకులు నిజంగా ప్రజాబలంతో నిలదొక్కుకున్నారు. కొందరు రాజకీయ నేతల మధ్య బంధుత్వాలకు సంబంధించి మనకి తెలియని అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబం నుంచి తండ్రి, కొడుకు, అల్లుడు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. మనవడు ఎంపీ అయ్యాడు. వియ్యంకుడు ఎమ్మెల్యే అయ్యారు. వీరిలో ఒక్కొక్కరు నాలుగు సార్లు, అయిదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయిదుసార్లు ఎన్నికైన వారిలో బావాబావమరుదులు ఇద్దరూ ఉండటం విశేషం. అంతేకాకుండా కొందరు నాయకులు పార్టీలు మారి, నియోజక వర్గాలు, జిల్లాలు మారి పోటీ చేసి గెలుపొందారు. ఒక నేత మూడు పార్టీల తరపున శాసనసభకు, శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు. ఒక నియోజక వర్గంలో ఒకే కుటుంబం నుంచి 9 సార్లు ఎన్నికయ్యారు. ఒక నేత నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. అతనే మూడుసార్లు మంత్రిగా, ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా చేశారు.
ఒకే కుటుంబం నుంచి ఆరుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అదే కుటుంబం నుంచి ఒకేసారి ముగ్గురు శాసన సభకు, ఒకరు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరు ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులవడం విశేషం. తండ్రి, కొడుకు, కోడలు, మనవడు శాసనసభకు ఎన్నికవడమే కాక, వారిలో ముగ్గురు మంత్రి పదవులు, ఒకరు విప్ పదవిని అలంకరించారు. ఉమ్మడి ఏపీకి చెందిన ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో అనేకం ఉన్నాయి. ఈ పుస్తకం చదివితే మన రాష్ట్రంలో వారసత్వ, కుటుంబ రాజకీయాలు ఎంత బలమైనవో అర్థమవుతుంది. సాంబశివరావు పరిశోధన, శ్రమ కనిపిస్తాయి.

చెక్కగారున్నారా!

కాలింగ్ బెల్ విని తలుపు తీసింది మహాలక్ష్మి. ఎదురుగా పంగనామాలతో, పంచెకట్టుతో, లాల్చీ ధరించిన వ్యక్తి నిల్చున్నాడు. ఆ కాసేపట్లోనే జేబులోంచి, నశ్యం డబ్బా తీసి నాలుగుసార్లు పీల్చి, అయిదుసార్లు తుమ్మాడు. ఆరోసారి వచ్చే తుమ్మును ఆపుచేసుకుంటూ, తలుపు తీసి వచ్చిన ఆవిడవైపు తేరిపార చూసి తనలో అచ్చు మహాలక్ష్మిలానే వుంది అని లోపల అనుకోబోయి పైకే అనేశాడు, ఆమె విన్నది.
‘‘నా పేరు కూడా మహాలక్ష్మేలే! ఎవరు కావాలి’’ అడిగింది.
‘‘చెక్కగారున్నారా!’’ అడిగాడు ఆ వ్యక్తి కావాలనే అలా పిలిచి.
‘‘చెక్కలూ, తలుపులూ ఇక్కడేం లేవు. ఏదన్నా కలప అడితీకిపోతే అక్కడ దొరుకుతయ్’’ అంటూ చివాలున తలుపేసుకొని లోపలకెళ్లిందామె. విషయాలన్నీ తెలిసినా, ఎవరూ గమనించకుండా తెలియనట్లు నటిస్తూ, ఆ వచ్చిన వ్యక్తి సణుక్కుంటూ ఓసారి అక్కడున్న నేమ్ ప్లేటును చూశాడు. అందులో వెర్రి వెంకటరమణ అని వుంది. అడ్రసు కరెక్టేనే అనుకొంటూ మళ్లీ కాలింగ్ బెల్ నొక్కాడు. ఈసారి ఓ ముసలావిడ తలుపు తీసింది.
‘‘చెక్కగారున్నారా!’’ అడిగాడు.
‘‘లేడు నాయనా! ఈమధ్యనే గండుచీమ కుట్టి కాలంతా వాచి నానా యాతన పడ్డాడు. తిరుపతి వెంకటేశ్వరునికి మొక్కుకున్నాడు. తగ్గింది. మొక్కు తీర్చుకునేందుకు తిరుపతి వెళ్ళాడు’’ అంటూనే తలుపేయబోయిందావిడ.
‘‘ఆయన మీకేవౌతాడు’’
‘‘మా అబ్బాయే’’
‘‘మీ అబ్బాయి పేరు రమణ కదా! చెక్కగారంటున్నారంతా ఎందుకు’’
‘‘ఇదివరకలా అనవాళ్ళు కాదు. ఇప్పుడేమిటో అదో ఫ్యాషన్‌లా అలానే పిలుస్తున్నారు. చిన్నప్పట్నుంచీ అరగదీసిన గంధంలా చక్కగా ఘుమఘులాడుతుండేవాడు. అందుకని మేం ముద్దుగా గంధపు చెక్క అని పిలుస్తుండేవాళ్ళం. ఈ పేరెలా బయటకు పొక్కిందోగానీ, అందరి నోళ్ళలోనూ మావాడి పేరు పోకచెక్కలా నానుతోంది’’.
‘‘మీ అబ్బాయి నిజంగానే మంచి గంధపు చెక్కలాంటివారేనండీ’’ కాస్త పొగిడాడు నశ్యండబ్బా తీసి పీలుస్తూ.
‘‘అయ్యో నిలబెట్టే మాట్లాడుతున్నాను. లోపలికి రా నాయనా’’ అంటూ లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా ఇచ్చి మర్యాద చేసింది.
‘‘మీరు చెప్పినవన్నీ బాగున్నాయండీ. ఆ మహాలక్ష్మిగారు మీ కోడలా! చెక్కగారున్నారా అని అడిగితే విసుగ్గా లేరని తలుపేసుకొన్నారు. మీ కోడలికీ, మీ అబ్బాయికీ మధ్య ఏవైనా గొడవలా’’ సందేహంగా అడిగాడు.
‘‘మా కోడలే! అలాంటివేం లేవు గానీ, వాళ్ళాయన్ను అందరూ అలా పిలుస్తుంటే చిరాకేస్తోంది. ఎవరి మొగుణ్ణయినా చెక్కగారూ, కుక్కగారూ అని పిలిస్తే కోపం రాదూ. అంతే, ఇంతకూ నీ పేరు చెప్పావుకావు’’ అందామె.
‘‘నా పేరు గోవింద గోపాలం. నా పేరులోనూ ఓ చిక్కుంది’’
‘‘ఏమిటో’’
‘‘పుణ్యమొస్తుందని ఇంట్లో అందరూ గోవింద గోపాలం అనే పిలుస్తారు. కానీ,బయట మాత్రం అందరూ పొడి పొడిగా గోగో అని పిలుస్తూ రమ్మంటారు. ఇంట్లోనేమో ప్రాచీన హోదాలో తెలుగు, బయటనేమో ప్రాపంచిన భాషలో గోగో వివరించాడు.
‘‘నిజమేలే! ఇప్పుడంతా అలానే వుందిలే నాయనా. మా పిన్ని కొడుకు ఒకడున్నాడు. వాడు ఇంట్లో భగవద్గీత చదువుతాడు. బయటకెళ్ళేటప్పుడు బైబిలు చదువుకొంటూ వెళ్తాడు. ఇంటికొచ్చేటప్పుడు మసీదు నుంచి వస్తాడు. అదేమిట్రా అంటే నీకు తెలీదులే పెద్దమ్మా. దేవుడు ఏ రూపంలో వచ్చి మన కోర్కెలు తీరుస్తాడో ఈ రోజుల్లో ఎవరూ చెప్పలేరు. అందుకని ఎవర్నీ విడిచిపెట్టకూడదు అంటాడు’’.
‘‘అతనేం చేస్తుంటాడేమిటి’’
‘‘ఆ ఏం చేస్తాడు. చదువూ లేదూ చట్టుబండలూ లేదు. కొన్నాళ్ళు బ్లాకులో సినిమా టిక్కెట్లు అమ్మే ఉద్యోగం చేశాడు. ఆ డబ్బుతో జల్సా చేస్తూ, రికార్డు డాన్సులనీ, బార్లలో బీర్లనీ, రోడ్లలో వెళ్ళే పోర్లతో ప్రేమలనీ, ఇంకా ఏమిటో వాడి బొంద, వాడి బోలే. చిట్టచివరగా ఇపుడు ఓ రాజకీయ నాయకుడికి వెంట పెంపుడు కుక్కలా తిరుగుతూ, బక్కచిక్కి ఛస్తున్నాడు.

-షణ్ముఖశ్రీ ఆకాశవర్షిణి నుంచి... -సశేషం

-శిరందాసు నాగార్జున 9440222914