జాతీయ వార్తలు

పటియాలా హౌస్ కోర్టు వద్ద మళ్లీ ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో పోలీసులు అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ను ఇక్కడి పటియాలా హౌస్ కోర్టు వద్దకు తీసుకువచ్చిన సందర్భంగా బుధవారం మళ్లీ ఘర్షణలు చెలరేగి ఉద్రిక్తతకు దారితీసింది. తమపై కొందరు లాయర్లు దాడిచేశారని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. కన్నయ్యకుమార్‌పై కొందరు న్యాయవాదులు దాడి చేశారని సమాచారం. కోర్టు వద్ద జరిగిన సంఘటనలపై నిజానిజాలు తెలుసుకునేందుకు సుప్రీం కోర్టు ఓ ప్రతినిధి బృందాన్ని పటియాలా హౌస్‌కు పంపింది. న్యాయవాదులు దాడులకు దిగడం పట్ల పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు.