జాతీయ వార్తలు

జర్నలిస్టులపై దాడి కేసు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నగరంలోని పాటియాలా హౌస్ కోర్టు వద్ద ఇటీవల జర్నలిస్టులపై కొందరు లాయర్లు జరిపిన దాడికి సంబంధించి నమోదైన కేసుపై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. దాడి ఘటనపై సుప్రీం నియమించిన న్యాయవాదుల బృందం, కోర్టు రిజిస్ట్రార్ ఇప్పటికే సమాచారం సేకరించి ఉన్నత న్యాయస్థానానికి నివేదికలు సమర్పించారు. ఇదే విషయమై దిల్లీ పోలీసు కమిషనర్ కూడా కోర్టుకు ఓ నివేదిను అందజేస్తారు. ఈ మూడు నివేదికలను పరిశీలించిన మీదట జర్నలిస్టులపై దాడికి సంబంధించిన కేసును విచారిస్తామని సుప్రీం కోర్టు గురువారం ప్రకటించింది.