జాతీయ వార్తలు

అస్సాం, బెంగాల్‌లో ముగిసిన పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు సోమవారం రెండోదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో విడతతో అస్సాంలో పోలింగ్ ప్రక్రియకు తెరపడింది. ఈ రాష్ట్రంలో 75 శాతం, బెంగాల్‌లో 70 శాతం మేరకు పోలింగ్ జరిగినట్లు అంచనా. ఒకటి, రెండు స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్‌లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అస్సాంలో దేశ సరిహద్దు ప్రాంతంలో, బోడో తీవ్రవాదుల ప్రభావిత ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగాల్‌లో ఓ పోలింగ్ కేంద్రం వద్ద తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.