జాతీయ వార్తలు

బిజెపికి కీర్తి అజాద్ భార్య గుడ్‌బై..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బిజెపి దిల్లీ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ క్రికెటర్, ఎంపి కీర్తి అజాద్ భార్య పూనమ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజ్యసభకు, బిజెపికి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో కీర్తి అజాద్ భార్య కూడా బిజెపికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు ఎంపీ కీర్తి అజాద్‌ను గత ఏడాదే బిజెపి నుంచి బహిష్కరించారు. కాగా, బిజెపికి తన భార్య పూనమ్ గుడ్‌బై చెబుతారా? అన్న విషయమై వ్యాఖ్యనించేందుకు కీర్తి అజాద్ నిరాకరించారు. బహిష్కృత ఎంపీగా తాను ఏమీ చెప్పలేనని, అయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విచక్షణ పూనమ్‌కు ఉందన్నారు. మరోవైపు ఈ పరిణామాలు బిజెపి నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.